AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ పాతబస్తీ స్మశానవాటికలో దొంగలు పడ్డారు.. ఏకంగా గుంతను తవ్వి శవాన్నే ఎత్తుకెళ్లారు..!

దొంగలు ఇళ్లల్లోనే కాదు స్మశాన వాటికల్లోనూ పడుతున్నారు. ఏంటి స్మశాన వాటికలో ఏం దొరుకుతుందని దొంగలు పడ్డారనేగా మీ అనుమానం. అసలు విషయం వేరే ఉంది. వారం..

హైదరాబాద్‌ పాతబస్తీ స్మశానవాటికలో దొంగలు పడ్డారు.. ఏకంగా గుంతను తవ్వి శవాన్నే ఎత్తుకెళ్లారు..!
Subhash Goud
|

Updated on: Jul 10, 2021 | 7:05 AM

Share

దొంగలు ఇళ్లల్లోనే కాదు స్మశాన వాటికల్లోనూ పడుతున్నారు. ఏంటి స్మశాన వాటికలో ఏం దొరుకుతుందని దొంగలు పడ్డారనేగా మీ అనుమానం. అసలు విషయం వేరే ఉంది. వారం రోజుల కిందట మృతి చెందిన ఓ చిన్నారి మృతదేహం మాయం కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో హైదరాబాద్‌లోని పాతబస్తీ పహాడీషరీఫ్‌ స్మశానవాటికలో చోటుచేసుకుంది. అసలు మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు.. ఎందుకు తీసుకెళ్లారనే విషయం మాత్రం అంతుచిక్కని మిస్టరీగా మారింది. అయితే పూడ్చి పెట్టిన చిన్నారి మృతదేహం మాయం కావడంపై చిన్నారి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు మృతదేహం మాయం కావడంపై విచారణ చేపడుతున్నారు.

అయితే స్మశాన వాటికలోంచి చిన్నారి మృతదేహం మాయం కావడం గుర్తించిన కుటంబ సభ్యులు.. స్మశాన వాటికలోని చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ కనిపించకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  చిన్నారులను కిడ్నాప్‌ చేయడం చూశాం.. కానీ.. పూడ్చి పెట్టిన చిన్నారి శవాన్ని ఎత్తుకెళ్లడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తోంది. శవాన్ని ఎత్తుకెళ్లే అవసరం ఏముంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ కూాడా చదవండి

VIRAL VIDEO : హైదరాబాద్‌లో ఘరానా పిక్ పాకెటర్స్..! పర్సు ఎలా కొట్టేస్తున్నారో వీడియోలో చూడండి..

Hyderabad : టిమ్స్‌లో శవాల సొమ్ము కాజేస్తున్న దొంగలు..! ఎవరో కాదు ఆస్పత్రిలో పనిచేసేవారే..