Telangana Assembly Live: మూడో రోజు పక్కా యాక్షన్ ప్లాన్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజుకు చేరుకున్న వేళ రాజకీయ వేడి మరింత పెరిగింది. తాతా మధు వ్యవహారంపై మండలిలో చర్చ జరగనుండగా, హేట్ స్పీచ్ అంశంపై సీఎం రేవంత్రెడ్డి చర్చలో పాల్గొననున్నారు. మరోవైపు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలవనున్నారు. దీంతో ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
మూడోరోజు కూడా తెలంగాణ అసెంబ్లీలో ముచ్చెమటలేనా. పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వస్తున్నాయి పార్టీలు. సో.. బీఆర్ఎస్ ఏం చేయబోతోంది. కాంగ్రెస్ ఎలా నిలువరించబోతోంది. రెండు పార్టీల మధ్య బీజేపీ అజెండా ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు బుధవారం ప్రారంభయ్యాయి. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై అధికారపార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగా చర్చ జరగే అవకాశం కనిపిస్తోంది. అయితే.. సభా సమయం వృధా చేయొద్దని.. సభను సజావుగా నడిపించాలని బీజేపీ కోరుతోంది.. ఈ క్రమంలో ఇవాళ ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. మండలిలో తాతా మధు వ్యవహారంపై చర్చ జరగనుంది.. హేట్ స్పీచ్పై CM రేవంత్రెడ్డి చర్చలో పాల్గొననున్నారు.
గవర్నర్ ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
ఇదిలాఉంటే.. ఇవాళ గవర్నర్ను BRS ఎమ్మెల్యేలు కలవనున్నారు. మధ్యాహ్నం 12:45కి గవర్నర్తో BRS ఎమ్మెల్యేల సమావేశం ఉండనుంది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరుపై.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు.
ఎవరెస్ట్ కరిగిపోతోంది.. కారణం ఇదే!
డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది
కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్తో పనిలేదు డ్యూడ్!
అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
