
Hyderabad: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్ (GHMC/క్యూర్) పరిధిలో శరవేగంగా కదులుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 7 ప్రధాన ప్రాంతాలను ఖరారు చేయగా, మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర నివేదిక ఈ వారంలోనే సిద్ధం కానుంది.
ఇది కూడా చదవండి: IRCTC: తత్కాల్ టికెట్స్ లభించడం లేదా? కన్ఫర్మ్ కావాలంటే ఇలా చేయండి.. వెంటనే బుక్ అవుతాయి!
గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను 10 అంతస్తుల (G+9) టవర్లుగా నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జులై మొదటి వారంలోనే ఇందుకు సంబంధించిన అధికారిక బ్రోచర్ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్లో ఆర్డీవో (RDO), తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నారు. ప్రస్తుత భవనాలకు మరమ్మతులు ఉంటే వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Tiger Forest: పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. అందుకే పులి సంరక్షణ కేంద్రాలు మూసివేత.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
ఇది కూడా చదవండి: Petrol Diesel Prices: వాహనదారులకు గుడ్న్యూస్.. ఆ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 తగ్గింపు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి