పెరుగుతున్న కిడ్నీ డిసీజ్ కేసులు…కారణాలు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు…ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన లేటెస్ట్ సర్వే

| Edited By: Jyothi Gadda

Jan 27, 2024 | 4:21 PM

కిడ్నీ ఫంక్షనింగ్ పై అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే...ఎక్కువగా డి హైడ్రేట్ అవ్వడం,యాంటిబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల టెంపరరీ కిడ్నీ డిసీజ్ బారిన పడ్తున్నట్టు సర్వే తేలిందని అంటున్నారు. ఒకప్పుడు కిడ్నీ వ్యాధుల పైన్ అవగాహన చాలా తక్కువ. పేషెంట్ కి అర్థం అయ్యేలా చెప్పడం చాలా కష్టం అని అన్నారు. చాలా మంది కిడ్నీ సమస్యలని సాధారణ సమస్యలుగా భావించి స్థానిక వైద్యులను సంప్రదిస్తున్నారు...కానీ

పెరుగుతున్న కిడ్నీ డిసీజ్ కేసులు...కారణాలు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు...ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన లేటెస్ట్ సర్వే
Indias Largest Conference
Follow us on

హైదరాబాద్, జనవరి 27; యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ పై అంతర్జాతీయ సదస్సులో.. కిడ్నీ డిసీజ్ కేసులు,చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు పై కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ముడు రోజుల పాటు సాగే ఈ సదస్సు కి వివిధ దేశాల నుండి వచ్చిన 30మంది పైగా నెఫ్రాలజిస్ట్ లు ప్రజల్లో మూత్రపిండాల వ్యాధుల పై అవగాహన కల్పించడం,చికిత్స వాటి విధి విధానాల పై వైద్యుల తో చర్చ,శిక్షణ ఇవ్వడం పై ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం అని నిర్వహకులు తెలిపారు.

ఈ సదస్సు లో ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ సంబధిత జబ్బుల పై చేసిన సర్వే పై ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ కిడ్నీ సంబధిత జబ్బుల పై సర్వే లో ప్రతి వంద మంది లో 17 మంది ఏదో రకంగా కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్నారని సర్వే రిపోర్ట్.దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 850 మిలియన్ మంది కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్నారని…ఇందులో దాదాపు కోటి మంది వరకు డయాలసిస్ అవసరం అవుతుంది అని సర్వే తేల్చింది.ముఖ్యంగా డెలివరీ అవుతున్న మహిళల్లో 7శాతం మంది మహిళలు కిడ్నీ డిసీజ్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారని పరిశోధకులు అంటున్నారు.

అయితే దీనికి గల కారణాలు కిడ్నీ ఫంక్షనింగ్ పై అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే…ఎక్కువగా డి హైడ్రేట్ అవ్వడం,యాంటిబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల టెంపరరీ కిడ్నీ డిసీజ్ బారిన పడ్తున్నట్టు సర్వే తేలిందని అంటున్నారు. ఒకప్పుడు కిడ్నీ వ్యాధుల పైన్ అవగాహన చాలా తక్కువ. పేషెంట్ కి అర్థం అయ్యేలా చెప్పడం చాలా కష్టం అని అన్నారు. చాలా మంది కిడ్నీ సమస్యలని సాధారణ సమస్యలుగా భావించి స్థానిక వైద్యులను సంప్రదిస్తున్నారు…కానీ నెఫ్రాలజీ లని సంప్రదించడం లేదు. కిడ్నీ సమస్యల పై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..