
జవాహర్నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ గురువారం విధుల్లో ఉండగా ఓ బైక్ రైడర్ వింతగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ను నియంత్రిస్తున్న సమయంలో ఆ వ్యక్తి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేశాడు. రాంగ్ రూట్లో వచ్చి కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగాడు. తనపై ముందే చలాన్ వేసిందని ఆగ్రహంతో ఉన్న ఆ వ్యక్తి, ఆమెను “నా సంపాదన అంతా మీకే ఇవ్వాలా?” అంటూ మహిళా కానిస్టేబుల్పై చేయి చేసుకున్నాడు.
కానిస్టేబుల్ పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించగా, రైడర్ ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, వీఎచ్ఎఫ్ సెట్స్ను లాక్కొని నేలకేసి కొట్టేశాడు. దీంతో అవి దెబ్బతిన్నాయి. అంతే కాదు, సదురు వ్యక్తి తన చేతిని మడిచాడని కానిస్టేబుల్ ఆరోపించింది. బాధితురాలు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో విధుల్లో యూనిఫాం ధరించిన అధికారిపై దాడి చేసినందుకు కీసర పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
మరో వైపు హైదరాబాద్ వెస్ట్ జోన్ లో మహిళలను వేధించందం, పబ్లిక్లో మద్యం సేవించడం, ప్రజా శాంతిభద్రతకు భంగం వంటి కేసుల్లో అరెస్టు చేసిన 22 మందికి కోర్టు ప్రత్యేకంగా శిక్ష విధించింది. గురువారం కోర్టు ఆదేశాల మేరకు వారిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో కమ్యూనిటీ సర్వీస్ చేయించేందుకు పంపారు పోలీసులు.
నగరంలో మహిళల వేధింపులను అరికట్టడం, రోడ్లపై మద్యం సేవించడం, పబ్లిక్ న్యూసెన్స్, వీధి నేరాలను తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక దళాలను రంగంలోకి దించారు. ఈ చర్యల భాగంగానే పలువురిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.