Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో షాకింగ్ డెసిషన్.. ట్రాన్స్జెండర్లకు కీలక బాధ్యతలు.. ఏంటంటే..?
హైదరాబాద్ మెట్రో ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం కొత్త సర్వీసులు ప్రవేశపెడుతోంది. ఇటీవల మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లను అందుబాాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రయాణికులు తమ లగేజీని భద్రపర్చుకోవడానికి ఈ స్మార్ట్ లాకర్లు ఉపయోగడపనున్నాయి. తాజాగా మెట్రో మరో కొత్త నిర్ణయం తీసుకుంది.

Metro Services: హైదరాబాద్ మెట్రో ఎప్పటికప్పుడు ఏదోక కొత్త నిర్ణయం తీసుకుంటోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం అందించేందుకు అనేక సౌకర్యాలు ప్రవేశపెట్టడంతో పాటు నిర్వహణపరంగా కూడా అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా తాజాగా హైదరాబాద్ మెట్రో మరో నిర్ణయం తీసకుంది. 20 మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డ్లుగా నియమించింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగా ఈ ముందడుగు వేసినట్లు స్పష్టం చేసింది. మహిళల భద్రతను బలోపేతం చేయడంతో పాటు వారికి గౌరవం, భరోసా కల్పించడంలో భాగంగా ఇదొక వ్యూహాత్మక ప్రయత్నంగా అధికారులు చెబుతున్నారు.
20 మంది ట్రాన్స్జెండర్లు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. నేటి నుంచి ఎంపిక చేసిన స్టేషన్లు, మెట్రో రైళ్ల లోపల విధులు నిర్వర్తించనున్నారు. మెట్రో రైలు మొత్తం మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో నడుస్తోంది. రోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు సేవలను వినియోగించుకుంటున్నారు. వీరిలో దాదాపు 30 శాతం మంది మహిళలు ఉంటున్నారు. దీంతో వారికి భద్రత, సౌకర్యాలు కల్పించడంపై మెట్రో దృష్టి సారించింది. మహిళల భద్రతను బలోపేతం చేయడం వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమించడం అందులో భాగమేనని తెలుస్తోంది.

Transgenders
ప్రస్తుతం నియమించుకున్న వారికి మహిళా కోచ్లలో భద్రత కోసం ఉపయోగించుకున్నారు. మరికొంతమందిని ప్రయాణికుల బ్యాగేజ్ స్కానర్లను పర్యవేక్షించే దగ్గర ఉంచనున్నారు. ఇక కొంతమందిని ప్రయాణికులకు సమాచారం అందించడానికి వినియోగించనున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రమంతటా అందరికీ గౌరవం, సమాన అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వ బాటలోనే నడుస్తున్న మెట్రో.. ట్రాన్స్జెండర్లకు ఈ అవకాశం కల్పించింది. రానున్న రోజుల్లో మరికొంతమంది ట్రాన్స్జెండర్లను మెట్రోలో పలు సర్వీసుల్లోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
