
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా చిన్నారులను ఎత్తుకొచ్చి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్న చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠా చిన్నారుల విక్రయాల కోసం గుజరాత్, హైదరాబాద్లో నగరంలో భారీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు గుజరాత్ నుంచి చిన్నారులను కొనుగోలు చేసి వారిని హైదరాబాద్లో విక్రయిస్తున్నట్టు తెలుసుకున్నారు. అయితే ఇటీవల ఓ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన అహ్మదాబాద్ పోలీసులు నలుగురు ఏజెంట్లు పట్టుబడగా.. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు.
అటు గుజరాత్, ఇటు హైదరాబాద్లో భారీ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్న ఈ ముఠా గడిచిన రెండేళ్లలో సుమారు 25 మంది చిన్నారులను హైదరాబాద్లో విక్రయించినట్టు పోలీసులు కనుగొన్నారు. పిల్లలు లేని వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న ఈ ముఠా స్థానికంగా ఉన్న ఐవీఎఫ్ సెంటర్లతో చేతులు కలిపి ఈ దందాను కొనసాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. గుజరాత్లో అక్రమంగా జన్మించిన చిన్నారులను హైదరాబాద్కు తరలించి.. ఇక్కడ ఉన్న ఏవీఎఫ్ సెంటర్ల ద్వారా పిల్లలు లేని దంపతులకు చిన్నారులను తక్కువ రేట్లకు విక్రయించి సొమ్మ చేసుకుంటున్నారు.
పిల్లలకు రేట్లు ఎలా నిర్ణఇస్తారు?
ఈ ముఠా పిల్లల రంగు, జెండర్ను బట్టి ధరలు నిర్ణయిస్తున్నట్టు పోలీసలు గుర్తించారు. చిన్నారులు కొద్దిగా ఫెయిర్గా ఉంటే రూ.7లక్సలు, తక్కువ కలర్ ఉంటే రూ.4లక్షలు, ఆడపిల్లలు అయితే రూ.5 నుంచి 10 లక్షలు, అదే మగపిల్లలకు రూ.10 నుంచి 15 లక్షల వరకు వీరు ధరలు నిర్ణయించి విక్రయించే వారట. అయితే ఈ ముఠాలో ఉన్న చాలా మంది ఇంతకు ముందు ఐపీవీఎఫ్ సెంటర్లలో పనిచేసినవారేనని పోలీసులు గుర్తించారు.
అయితే ముఠా సభ్యులు ఎక్కువగా ఐవీఎఫ్ సెంటర్లలో పనిచేసిన వారే కావడంతో పోలీసులు ప్రస్తుతం నగరంలో ఐవీఎఫ్ సెంటర్లపై నిఘా పెంచారు. పిల్లలు లేని దంపతులు అనాదాశ్రమం, లేదా చట్టబద్దంగా పిల్లలను దత్తత తీసుకోవాలని, ఇలా ఐవీఎఫ్ సెంటర్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమని.. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా చిన్నారులను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.