హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరాల కలకలం.. పోలీసుల అదుపులో యువకులు

|

Dec 24, 2020 | 9:34 AM

సీనియర్ ఐపీఎస్ అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు డీజీ రవి గుప్తా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇళ్లపై...

హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరాల కలకలం.. పోలీసుల అదుపులో యువకులు
Follow us on

సీనియర్ ఐపీఎస్ అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు డీజీ రవి గుప్తా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇళ్లపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ సంచలనంగా మారింది. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేసిన పోలీసు అధికారులు.. డ్రోన్ కెమెరాల వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము ఫోటో షూట్ కోసం డ్రోన్ కెమెరాలు ఎగురవేశామని యువకులు చెబుతున్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కాగా, డ్రోన్ కెమెరాలు ఎగరడం వెనుక ఎలాంటి దురుద్దేశంలేదని ప్రాథమికంగా అంచనాకు వచ్చిన పోలీసులు.. మరింత విచారణ జరుపుతున్నారు.