AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ బిట్స్ పిలానీకి పూర్వ విద్యార్థి భారీ విరాళం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీకి అమెరికాకు చెందిన పూర్వ విద్యార్థి భారీ విరాళం ప్రకటించారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించేందుకు ముందుకొచ్చారు. ప్రతీ ఏటా 16 మంది విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించనున్నారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు వెల్లడించారు.

Hyderabad: హైదరాబాద్ బిట్స్ పిలానీకి పూర్వ విద్యార్థి భారీ విరాళం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
Bits Pilani
Venkatrao Lella
|

Updated on: Feb 05, 2026 | 1:21 PM

Share

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీకి పూర్వ విద్యార్థి చంద్ పి. గార్గ్ భారీ విరాళం ప్రకటించారు. ఇక్కడ చదుకునే విద్యార్థులకు ప్రతీ ఏడాది స్కాలర్ షిప్‌లను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో 16 మందికి ప్రతీ ఏటా స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్ధిక సాయం అందించనున్నారు. వీటిల్లో విద్యార్థినులకు ఎక్కువగా స్కాలర్ షిప్‌లను ఇవ్వనున్నట్లు తెలిపారు. చదువుపై ఆసక్తి ఉండి ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులను గుర్తించి ఈ సాయం అందించనున్నారు. ఇందుకోసం చంద్ పి గార్గ్ రూ.33 కోట్ల భారీ విరాళం బిట్స్ పిలానీకి అందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూపంలో వీటిని అందించనున్నారు.

రూ.33 కోట్ల భారీ విరాళం

చంద్ పి గార్గ్ విరాళం ప్రకటించడంపై బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ వైస్ చాన్సలర్ వి.రాంగోపాల్ రావు స్పందించారు. పూర్వ విద్యార్థి 4 మిలియన్ డాలర్ల భారీ విరాళం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. బిట్స్ పిలానీతో పూర్వ విద్యార్థులకు ఉన్న లోతైన బంధాన్ని ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. విద్యార్థులకు అండగా నిలిచేందుకు పూర్వ విద్యార్థి అందించిన అతిపెద్ద వ్యక్తిగత విరాళం ఇప్పటివరకు ఇదేనని తెలిపారు. చంద్ పి గార్గ్ 1968లో బిట్స్ పిలానీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

పెరిగిన ఫండ్

తన భార్యతో కలిసిన చంద్ గార్గ్ ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను చదివిన కాలేజీకి కృతజ్ఞతగా ఈ విరాళం ఇస్తున్నా.. జీవితంలో నేను సాధించిందంతా బిట్స్ పిలానీలో నేను నేర్చుకున్న విషయాలోనే ప్రారంభమైంది. దీంతో ఆర్ధిక ఇబ్బందుల వల్ల విద్యార్థుల చదువు ఆగకూడదనే ఉద్దేశంతో ఈ విరాళం ప్రకటిస్తున్నా” అని పేర్కొన్నారు. కాగా చంద్ గార్గ్ ప్రకటించిన విరాళంతో బిట్స్ పిలానీ ఎండోమెంట్ ఫండ్ రూ.280 కోట్లు దాటింది.

Follow Us
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..
జూనియర్ ఎన్టీఆర్‏కు ఇష్టమైన పాట అదే.. రాజమౌళి చెప్పిన నిజం..
జూనియర్ ఎన్టీఆర్‏కు ఇష్టమైన పాట అదే.. రాజమౌళి చెప్పిన నిజం..
బాబోయ్.. బాలయ్య సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..?
బాబోయ్.. బాలయ్య సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..?
తెలుగు తెరపై ఉవ్వెత్తున ఎగసిని తార.. కానీ 36 ఏళ్లకే..
తెలుగు తెరపై ఉవ్వెత్తున ఎగసిని తార.. కానీ 36 ఏళ్లకే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటో తెలుసా..?
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటో తెలుసా..?
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు.. నేటి నుంచి భారీ వర్షాలు!
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు.. నేటి నుంచి భారీ వర్షాలు!