Rain Alert: ఇక నాన్స్టాప్ వర్షాలే వర్షాలే.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భరీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటకలో పూర్తిగా, మహారాష్ట్రలో ముంబైతో పాటుగా, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అస్సాం మేఘాలయ లోని కొన్ని ప్రాంతాలకు, మణిపూర్, నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. మరాఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం దానికి అనుబంధంగా మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గడ్ – దక్షిణ ఒడిస్సా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటుమట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది..
వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కోమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 37.8, కనిష్టంగా మహబూబ్ నగర్ లో 27.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు..
ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో మూడు రోజులపాటు చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం(27-05-2025) శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం(28-05-2025) శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
నిన్న జ్సోమవారం సాయంత్రం 5గంటల నాటికి అల్లూరి జిల్లా రాచపనుకులులో 56మిమీ, విజయనగరంలో 42.7మిమీ, మారేడుమిల్లిలో 41.5మిమీ, గంపరైలో34మిమీ, నెల్లిమర్లలో 33మిమీ, అన్నమయ్య జిల్లా ఎంగిలిబండ, కర్నూలు జిల్లా కామవరంలో31.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
