దడ పుట్టిస్తోన్న హైడ్రా కూల్చివేతలు.. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

|

Aug 27, 2024 | 12:38 PM

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చేస్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒవైసీ బ్రదర్స్‌కి సంబంధించిన అక్రమ కట్టడాలపై హైడ్రా కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్స్ మాధ్యమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి

దడ పుట్టిస్తోన్న హైడ్రా కూల్చివేతలు.. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
Akbaruddin Owaisi
Follow us on

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చేస్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒవైసీ బ్రదర్స్‌కి సంబంధించిన అక్రమ కట్టడాలపై హైడ్రా కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్స్ మాధ్యమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పాతబస్తీ వాసులు ఫిర్యాదు చేశారు. బండ్లగూడ సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని.. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ఎక్స్‌లో సీఎం రేవంత్‌ను జనాలు ప్రశ్నిస్తున్నారు . దీంతో ఫాతిమా కాలేజ్‌పై వస్తున్న ఫిర్యాదులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. తన పై కక్ష ఉంటే తూటాలతో కాల్చాలని.. కానీ తమ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకోవద్దన్నారు అక్బరుద్దీన్.

పేదలకు ఉచిత విద్యను అందించేందుకే 12 భవనాలను నిర్మించానని.. వీటిని ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుగా చూపిస్తున్నారని చెప్పారు అక్బరుద్దీన్‌. తాను బలహీనుడినయ్యానని శత్రువులు అనుకుంటున్నారని.. ఒక వేళ కూల్చివేతల వరకు వస్తే తన కాలేజీలోని విద్యార్థినులే సైన్యంగా మారి అడ్డుకుంటారని అక్బరుద్దీన్ హెచ్చరించారు. ఇటు హైడ్రా కూల్చివేతలపై ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్‌, GHMC కార్యాలయం సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ భవనాలు ఎఫ్టీఎల్‌లో ఉన్నాయని వాటిని కూడా ప్రభుత్వం కూల్చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని భవనాలకు ఒకే న్యాయం ఉండాలన్నదే తమ అభ్యంతరమన్నారు అసదుద్దీన్ ఒవైసీ.