
ఈ ఏడాది నైరుతి ముందే పలకరించే సరికి రైతులు పులకరించిపోయారు. నైరుతి కేరళ నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిందన్న మాటే గానీ.. ఆ తరువాత అడ్రస్సే లేకుండా పోయింది. ఒకానొక దశలో పొలాలు బీడులువారాయి. వర్షపుజాడ కోసం అన్నదాతలు నింగికేసి చూస్తే సుర్రుమనిపించే ఎండలు, ఉక్కపోతలే కనిపించాయి తప్పితే.. మేఘాల్లేవ్. ఇక ఈ సీజన్ ఇంతేనేమో అనుకుంటుండగా… దంచికొట్టే వానలతో నేలమీదకి దిగాయి మేఘమాలలు. ఒక్కో ప్రాజెక్ట్ నిండుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వరదలు రోడ్లను ముంచెత్తుతున్నాయా. కానివ్వండి కాసేపలా భరిద్దాం. జడివానతో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతున్నామా. కొత్తేం కాదుగా మనకి.. ఏ పాటలు వింటూనో, రీల్స్ చూస్తూనో సమయాన్ని గడిపేద్దాం. మరీ ఇళ్లల్లోకి నీళ్లొచ్చినా కూడా భరించాలా. చేసేదేం లేదుగా చిరాకుగా ఉన్నా ఆ జలతరంగిణి ఆహ్వానిద్దాం. కాకపోతే జాగ్రత్తపడదాం. అధికారులు చెప్పేది విందాం. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉందాం. ఈ సీజన్లో కాకపోతే ఇంకెప్పుడు పడతాయి ఈ వానలు. ఏడాదంతా కడుపు నిండాలంటే రిజర్వాయర్లన్నీ నిండుగా ఉండాలిగా. ఆ ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉంటేనే.. మధ్యలో వానలు కురవకపోయినా, సమ్మర్లో ఎండలు ఠారెత్తించినా, మళ్లీ నైరుతి పలుకరించేదాకా ఇప్పుడు ప్రాజెక్టుల్లో ఒడిసిపట్టి ఉంచిన నీళ్లే మనకు ఆధారం. సో, ప్రాజెక్టులు, వాటిల్లోని నీటి నిల్వలు, వస్తున్న ఇన్ఫ్లో,...