Telangana: పేరుకే ప్రభుత్వ పెద్దాసుపత్రి.. జ్వరం బిల్ల నుంచి సెలైన్‌ వరకు అన్ని ప్రైవేట్‌లోనే..ఎక్కడంటే..!

|

Aug 27, 2022 | 8:57 AM

సీజనల్ వ్యాధులతో గత కొన్నిరోజులుగా ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతుంది. మలేరియా, డెంగీ జ్వరాలతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు మాత్రం ఇక్కడ తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.

Telangana: పేరుకే ప్రభుత్వ పెద్దాసుపత్రి.. జ్వరం బిల్ల నుంచి సెలైన్‌ వరకు అన్ని ప్రైవేట్‌లోనే..ఎక్కడంటే..!
Government Hospitals
Follow us on

Telangana: పెద్దాసుపత్రని పేరేకాని.. రోగులకు మాత్రం అక్కరకు రావడం లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి నిరుపయోగంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీజనల్ వ్యాధులతో గత కొన్నిరోజులుగా ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతుంది. మలేరియా, డెంగీ జ్వరాలతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు మాత్రం ఇక్కడ తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు రోగులు.

ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ మిషన్ చెడిపోయి నెలలు గడుస్తున్నా రిపేర్ చేయించకపోవడంతో.. టెస్ట్‌ల కోసం ప్రైవేటు ల్యాబ్ లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. చిన్నపాటి జ్వరం టాబ్లెట్‌ మొదలు.. సెలైన్ బాటిళ్ల వరకు అన్ని బయట మెడికల్ షాపుల్లో తెచ్చుకోవాలని డాక్టర్లు చీటీలు రాసిస్తున్నారంటూ రోగులు వాపోతున్నారు. ఇక ఆసుపత్రిలో సరిపడా స్టాఫ్ కూడా లేకపోవడంతో సేవలు కూడా ఆలస్యంగా అందుతున్నాయని ఆవేనద వ్యక్తం చేస్తున్నారు రోగులు, స్థానిక ప్రజలు.

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలంటూ చెప్పే మాటలు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి పనితీరును చూస్తే అర్ధమవుతుందంటూ విమర్శిస్తున్నారు రోగుల బంధువులు. ఇక్కడి ప్రజలు, రోగులు ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు స్థానికులు. చెడిపోయిన మిషన్లను పట్టించుకోకుండా రోగులను తీవ్ర అవస్థల పాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. టెస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేసి, రోగులకు ఆర్థిక భారం లేకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి