Telangana: ఊరు చివర మామిడితోట.. తోటకెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో చూస్తే

| Edited By: Ravi Kiran

Jul 30, 2024 | 11:06 AM

తాళం వేసి ఉన్న ఇళ్లలోనో, బ్యాంక్‌లోనో దొంగతనాలు చేయడం గురించి వినే ఉంటాం. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే దొంగతనం కొంచెం వెరైటీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మామిడి నర్సరీలో విచిత్ర దొంగతనం చోటు చేసుకుంది. అక్కడ నర్సరీలో ఉన్న మోటారును ఇద్దరు దొంగలు..

Telangana: ఊరు చివర మామిడితోట.. తోటకెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో చూస్తే
Viral
Follow us on

తాళం వేసి ఉన్న ఇళ్లలోనో, బ్యాంక్‌లోనో దొంగతనాలు చేయడం గురించి వినే ఉంటాం. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే దొంగతనం కొంచెం వెరైటీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మామిడి నర్సరీలో విచిత్ర దొంగతనం చోటు చేసుకుంది. అక్కడ నర్సరీలో ఉన్న మోటారును ఇద్దరు దొంగలు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్ముగూడెం గ్రామానికి చెందిన గోపి.. స్థానికంగా మామిడి మొక్కల నర్సరీని ఏర్పాటు చేసుకుని మొక్కల ఎగుమతి చేస్తున్నాడు. అయితే ఆ మొక్కల ఖరీదు ఎక్కువగా ఉండటం.. చుట్టుపక్కల జనసంచారం తక్కువగా ఉండటంతో గత కొద్దినెలలుగా అశ్వారావుపేట పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో, తోటల్లో మోటార్లు చోరీకి గురవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నర్సరీ యజమాని గోపి.. తన మామిడి నర్సరీలో ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. నర్సరీల్లో సీసీ కెమెరాలు ఎవరు పెడతారనుకున్నారో ఏమో గాని, ఈ నర్సరీలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి ఎంతో దర్జాగా, తమ సొంత నర్సరీలో మోటార్ చెడిపోయినట్లు ఆ మోటార్‌కు విద్యుత్ కనెక్షన్ తొలగించి, ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఆలస్యంగా నర్సరీకు వచ్చిన యజమాని, విద్యుత్ వైర్లు కత్తిరించి ఉండటం, అక్కడ ఉండాల్సిన మోటార్ లేకపోవటం చూసి.. వెంటనే సీసీ కెమెరాలను చెక్ చేశాడు. అందులో ఇద్దరు వ్యక్తులు మోటార్‌ను దొంగిలించిన దృశ్యాలు కనబడటంతో.. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఈ మోటారు దొంగలను గుర్తించాలని.. సోషల్ మీడియాలో కూడా పెట్టడంతో ఈ దొంగతనం దృశ్యాలు వైరల్‌గా మారాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగలను వెతికే పనిలో పడ్డారు.