పేరు బ్రాండ్.. పీస్ లోకల్!

బ్రాండెడ్ వస్తువులంటూ మీ ఇంటికి వస్తున్నారా! అయితే జాగ్రత్త అవి బ్రాండెడ్ కాకపోవచ్చు, డూప్లికేట్ అయి ఉండొచ్చు. అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా వరంగల్ కేంద్రంగా సాగుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల దందా ఒకటి వెలుగు చూసింది. ఓ బ్రాండెడ్ కంపెనీ పేరుతొ యూపీకి చెందిన కొందరు వరంగల్ ను కేంద్రంగా చేసుకుని ఈ దందాలో అడ్డంగా బుక్కయ్యారు. ఏ వస్తువు కొనాలనుకున్నా బ్రాండెడ్ అయితే దాన్ని స్టేటస్ గా భావిస్తుంటారు. ఇప్పుడు బ్రాండెడ్ పేరుతొ బురిడీ కొట్టించే […]

పేరు బ్రాండ్.. పీస్ లోకల్!
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2019 | 9:58 PM

బ్రాండెడ్ వస్తువులంటూ మీ ఇంటికి వస్తున్నారా! అయితే జాగ్రత్త అవి బ్రాండెడ్ కాకపోవచ్చు, డూప్లికేట్ అయి ఉండొచ్చు. అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా వరంగల్ కేంద్రంగా సాగుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల దందా ఒకటి వెలుగు చూసింది. ఓ బ్రాండెడ్ కంపెనీ పేరుతొ యూపీకి చెందిన కొందరు వరంగల్ ను కేంద్రంగా చేసుకుని ఈ దందాలో అడ్డంగా బుక్కయ్యారు. ఏ వస్తువు కొనాలనుకున్నా బ్రాండెడ్ అయితే దాన్ని స్టేటస్ గా భావిస్తుంటారు. ఇప్పుడు బ్రాండెడ్ పేరుతొ బురిడీ కొట్టించే కేటుగాళ్లు తయారయ్యారు. అంతర్జాతీయ కంపెనీ సోని పేరుతో వరంగల్ కేంద్రంగా నకిలీవి అమ్ముతూ పట్టుబడ్డారు. కొంతమంది ఎలక్ట్రానిక్ షాపుల యజమానులతో కుమ్మక్కై ఈ దందా కొనసాగిస్తున్నారు.

ఈ విధంగా జనాలకు నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆసరాగా చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు. వీరి మాటలు విని టీవీ కొన్న ఓ వ్యక్తికి అది మూడు రోజుల్లోనే రిపేర్ కు వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా భాగోతం వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ దాడుల్లో 54 టీవీలు 120 హోమ్ థియేటర్లు 6 గురు ముఠా సభ్యులను స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ నకిలీ ల్యాప్ టాప్ లను, టీవీలను, హోమ్ థియేటర్లను ఒరిజినల్ వాటికంటే ముచ్చటగా ప్యాక్ చేస్తారు. వినియోగదారులు సులభంగా వీరి ట్రాప్ లో పడిపోతారు. వీరికి ఎక్కువగా డూప్లికేట్ పీసెస్ ఢిల్లీ నుండి సప్లై అవుతుంటాయి. అయితే వీరి వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.