AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..

జనగామ జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పసికందు కిడ్నాప్ కలకలం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంక్యుబేటర్ల వార్డులో చికిత్స పొందుతున్న పసికందును ఓ మాయలేడి కిడ్నాప్ చేసింది. బాలింతలా నటించి ఆ పసికందుకు పాలిస్తానని నమ్మించి.. కొంగులో చుట్టుకుని అపహరించింది.

ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..
anagama child abduction
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 9:41 AM

Share

జనగామ జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పసికందు కిడ్నాప్ కలకలం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంక్యుబేటర్ల వార్డులో చికిత్స పొందుతున్న పసికందును ఓ మాయలేడి కిడ్నాప్ చేసింది. బాలింతలా నటించి ఆ పసికందుకు పాలిస్తానని నమ్మించి అపహరించింది. పసికందును తన కొంగులో చుట్టుకొని పారిపోతున్న క్రమంలో కుటుంబ సభ్యులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.. ఆటోలో వెళుతున్న ఆమెను వెంబడించి క్యాచ్ చేశారు. ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఈ కిడ్నాప్ సంఘటన జనగామ జిల్లా చంపక్ హిల్స్ ప్రాంతంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరిగింది.. ఆస్పత్రి ఆవరణలో తిష్టవేసిన ఓ మాయలేడి పసిపిల్లల ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఆ పసికందు కుటుంబ సభ్యుల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇంక్యుబేటర్ వార్డులో మగ శిశువు చికిత్స పొందుతున్నాడు. రాత్రి ఆ శిశువు ఏడుస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఓ మహిళ బాలింతలా నటించింది. తన బిడ్డే అని పాలిస్తానని నమ్మించింది. ఆ పసికందుకు పాలిస్తున్నట్లు నటించి తన కొంగులో చుట్టుకొని పారిపోయింది.

ఈ క్రమంలో అక్కడే ఉన్న పసికందు కుటుంబసభ్యులు వార్డులోపలికి వెళ్లి వాళ్ల శిశువు లేదని గుర్తించారు.. వెంటనే అప్రమత్తమై ఆ మహిళను వెంబడించారు. ఆటోలో వెళ్తున్న మహిళను వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు.

ఆ మహిళను అదే ఆటోలో తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చారు.. కిడ్నాపైన పసికందును స్వాధీనం చేసుకుని ఆ మాయలేడికి దేహశుద్ధి చేశారు.. అడ్డువచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు.

పసికందును ఆటోలో తరలిస్తుండగా అచ్చం సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ మహిళను అప్పగించారు.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ యత్నించిన మహిళ రఘునాథపల్లి మండలానికి చెందిన జ్యోతిగా గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?
ఎంత మారిపోయింది భయ్యా.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..
ఎంత మారిపోయింది భయ్యా.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..