
తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్… కాంగ్రెస్ కీలక నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తానికి ఝలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. టీఆర్ఎస్లోకి రావాలని కేసీఆర్, కేటీఆర్ బంధువులు ఆహ్వానించారని బాంబు పేల్చారు. గాంధీభవన్లో ఉంటానో.. తెలంగాణభవన్లో ఉంటానో త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. యూపీఏ వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ సేఫ్ జోన్లో ఉంటుందని తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా దెబ్బతిందని తెలిపారు.