Etala Rajender: తెలంగాణలో రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కేంద్రంగా మరో వివాదం రాజుకుంటోంది. నియోజకవర్గంలో విచ్చలవిడిగా గన్లైసెన్స్లు ఇస్తున్నట్లు ప్రజలే చెబుతున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తనకూ, తన కుటుంబానికి ఏమాత్రం హాని కలిగినా బాధ్యత సీఎందే అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. గతంలో కొందరు చంపుతామని ఫోన్లు చేసి, రెక్కీలు నిర్వహించినప్పుడే ఎదురునిలబడ్డాను.. ఇప్పుడు ఈ బెదిరింపులు ఏమీ చెయ్యలేవంటూ వ్యాఖ్యానించారు.
ఈటల చేసిన ఆరోపణలకు వెంటనే సమాధానం ఇచ్చారు కరీంనగర్ సీపీ సత్యనారాయణ. ఈటల చేస్తున్న ఆరోపణలు అవాస్తవంగా కొట్టిపారేశారు. రెండేళ్లలో కేవలం ఇద్దరికి తప్ప ఎవ్వరికీ గన్ లైసెన్స్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆ ఇద్దరికీ మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందని ధృవీకరించాకే లైసెన్స్లు జారీ చేశామని అన్నారు. ఇప్పుడు ఈ గన్ లైసెన్స్ ఆరోపణలు సంచలనంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి