Telangana: ఇసుక దందాపై సీఎం రేవంత్ సీరియ‌స్- తాట తీయాలని అధికారులకు ఆదేశం

తెలంగాణ‌లో ఇసుక దొంగ‌ల‌పై రేవంత్ స‌ర్కార్ ఉక్కుపాదం మోప‌నుంది. అక్ర‌మ ర‌వాణ‌తో... స‌ర్కార్ ఖ‌జానా గండి కొడుతున్న ఇసుకాసురుల‌ భ‌ర‌తం ప‌ట్టేందుకు రెడీ అయ్యింది. ఓవ‌ర్ లోడ్‌లు, దొంగ బిల్లుతో... దండుకుంటున్న ... ఇసుక దందాకు బ్రేక్ వేయ‌సేందుకు రంగం సిద్దం చేసింది రేవంత్ స‌ర్కార్.

Telangana: ఇసుక దందాపై సీఎం రేవంత్ సీరియ‌స్- తాట తీయాలని అధికారులకు ఆదేశం
Revanth Reddy

Edited By:

Updated on: Feb 17, 2025 | 3:19 PM

తెలంగాణ‌లో ఇసుక దొంగ‌లు రెచ్చిపోతున్నారు. వాగు క‌నిపిస్తే చాలు… త‌వ్వేస్తున్నారు. రాత్రి, ప‌గ‌లు అన్న తేడాలేకుండా… య‌దేచ్చ‌గా… ఇసుక దందాకు తెగ‌ప‌డుతున్నారు. ఈ జిల్లా , ఆ..జిల్లా అన్న తేడా లేకుండా… ఇసుకాసురులు…. ఇసుక రీచ్‌లను మింగేస్తున్నారు. దీంతో… స‌ర్కార్ ఖ‌జానాకు గండికొడుతున్నారు.

తెలంగాణ‌లో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్,వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, పాల‌మూర్ జిల్లాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో ఇసుక తవ్వాలంటే…. టిజీఎండీసీ అనుమ‌తులు అవ‌స‌రం. ఇసుక కొనుగోళ్ల ప్ర‌క్రియ అంతా టిజీఎండీసీ అద్వ‌ర్యంలో అది కూడా ఆన్ లైన్ లో జ‌ర‌గాలి. అయితే…. టిజిఎండీసీ వెబ్ సైట్‌లో ఓపెన్ కాకుండానే… చాలా చోట్ల ఇసుక త‌ర‌లిపోతుంది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ లోని తాడిచ‌ర్ల బ్లాక్ 1, తాడిచెర్ల బ్లాక్ 2, ఖ‌మ్మ‌ప‌ల్లి, ఉటూరు. సూర్య‌పేట్ జిల్లా వంగ‌మ‌ర్తి, ములుగు ఇలా… ప్ర‌తి ఇసుక‌ రీచ్‌ల నుంచి…ప్ర‌తి రోజు వంద‌ల కొద్ది లారీలు…ఇసుక‌ను త‌ర‌లిస్తున్నారు. దోంగ బిల్లు, ఓవ‌ర్ లోడ్‌ల‌తో…. దోచేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయ‌ల విలువ‌పై ఇసుక‌ను… సాండ్ కేటుగాళ్ళు… దోచుకుంటున్నారు. దీంతో… ప్ర‌భుత్వ ఖ‌జానాకు రావ‌ల్సిని ఆదాయానికి గండి కొడుతుండ‌టంతో… రేవంత్ స‌ర్కార్ సీరియ‌స్ గా తీసుకుంది.

దొంగ చాటుగా రవాణా –

ఇసుక ద్వారా… స‌ర్కార్ కు ఏడాదికి… 6వేల కోట్ల‌కు పైగా…. ఆదాయం రావాల్సి ఉంది. అంతేకాదు.. ప్ర‌భుత్వం ఇంద‌రిమ్మ ఇండ్లు, ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఇసుక అవ‌రం ఎంతో ఉంది. ఇలా విలువైన కొంద‌రు దందాగా చేసుకోవ‌డంపై…. స‌ర్కార్ సీరియ‌స్  తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అక్ర‌మా ఇసుక ర‌వాణ‌పై…ఉక్కుపాదం మోపాల‌ని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గ‌త మైనింగ్ స‌మీక్ష‌ల‌తో… ఇందిర‌మ్మ ఇండ్లుకు ఉచిత ఇసుక ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి… దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు కూడా జారి చేశారు. అయినా… ఇసుక‌ దందా కొన‌సాగు తుండ‌టంతో…. ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారి చేశారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని ఆదేశించిన సీఎం… ఇసుక అక్ర‌మ దందాకు పాల్ప‌డుత‌న్న అక్రమార్కులపై క‌ఠీన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. స‌ర్కార్ ఖ‌జానాకు గండికొడుతున్న వారికి …. స‌హ‌క‌రించ‌వ‌ద్ద‌ని…. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు సైతం గ‌తంలోనే… సీఎం సూచించ‌న సంగ‌తి తెలిసిందే.

మొత్తానికి… రాష్ట్రంలో ఇసుక అక్ర‌మ ర‌వాణ‌ను అరిక‌ట్ట‌కపోతే…. ఇటు ఖ‌జానాకు న‌ష్టం కాక‌కుండా… ప్ర‌భుత్వ ప్రాజెక్టుకు సైతం… ఇసుక కొరత‌ నెల‌కొనే ప్ర‌మాదం ఉంది. దీంతో అల‌ర్ట్ యిన రేవంత్ స‌ర్కార్… ఇసుక దొంగ‌ల తాటా తీస్తామంటుంది. అయితే.. ప్ర‌తి చోట ఇసుక దోపిడి వెనుక ఉన్న అధికారులు, రాజ‌కియ నాయ‌కుల దందాల‌కు ఎలా బ్రేక్ వేస్తున్నందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..