AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రముఖ ఆధ్యాత్మకవేత్త శ్రీ త్రిదిండి చినజీయర్ స్వామిని పరామర్శించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి సోమవారం కేసీఆర్ వెళ్లారు.

చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్
Anil kumar poka
|

Updated on: Sep 14, 2020 | 7:37 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రముఖ ఆధ్యాత్మకవేత్త శ్రీ త్రిదిండి చినజీయర్ స్వామిని పరామర్శించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి సోమవారం కేసీఆర్ వెళ్లారు. స్వామీజీకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన తల్లి మంగతాయారు (85) తుదిశ్వాస విడిచారు. వయసు రిత్యా ఏర్పడ్డ అనారోగ్య కారణాలతో ఆమె ప్రాణాలొదిలారు. శనివారం ఆమెకు అత్యక్రియలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తదితరులు ఫోన్ ద్వారా పరామర్శించగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఆశ్రమానికి వెళ్లి జీయర్ స్వామికి తన సానుభూతిని వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జీయర్ స్వామిని పరామర్శిస్తోన్న సంగతి తెలిసిందే.