Khammam: వంద ఎకరాల్లో తెలంగాణ జన గర్జన.. 5 లక్షల మంది జనం.. ఓకే అన్న ఇద్దరు నేతలు

ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో ఉన్న పెద్దాయన..ఈయన ఇప్పుడే హస్తం పంచన చేరుతున్న కొత్తాయన..పొలిటికల్‌ గ్రాఫ్‌లో ఎవరి మైలేజ్‌ వాళ్లది..ఇద్దరిదీ ఖమ్మం జిల్లానే..

Khammam: వంద ఎకరాల్లో తెలంగాణ జన గర్జన.. 5 లక్షల మంది జనం.. ఓకే అన్న ఇద్దరు నేతలు
Bhatti Vikramarka - Ponguleti Srinivas Reddy

Updated on: Jun 28, 2023 | 9:26 PM

హై కమాండ్‌ ఆదేశంతోనే పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేస్తున్నారు భట్టి..108 రోజులు 1250 కిలోమీటర్ల లక్ష్యంగా భట్టి ప్రజలతో మమేకమై నడుస్తున్నారు. జులై 2న ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టడంతో ఆయన పాదయాత్ర ముగుస్తుంది. వైఎస్‌ మహాప్రస్థానంతో భట్టి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రను పోలుస్తున్న..ఆయన అభిమానులు ముగింపు సభను ఓ రేంజ్‌లో నిర్వహించాలనుకున్నారు. మహాప్రస్థానం ముగింపు సభలాగే భారీయెత్తున జన సమీకరణ చేసి..రాహుల్‌ను చీఫ్‌ గెస్టుగా పిలిచి..సత్తా చాటాలనుకున్నారు. బట్‌ టోటల్‌ సీన్‌ మారింది. అనుకున్నదొక్కటి అవుతున్నదొక్కటి. బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేసి చేతిలో చెయ్యి వెయ్యడానికి వస్తున్న పొంగులేటి కూడా..జులై 2నే ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారు. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వంద ఎకరాల్లో తెలంగాణ జన గర్జనపేరుతో అతిపెద్ద బహిరంగ సభను నిర్వహించి..తనేంటో తెలంగాణ మొత్తానికి తెలిసేలా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాహుల్‌ సమక్షంలో చేరడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.

ఇక్కడే పార్టీ పెద్దలకు ఓ చిక్కొచ్చి పడింది. అటు భట్టి పార్టీలో సీనియర్‌..పొంగులేటి పొలిటికల్‌గా సీనియర్‌ అయినా..పార్టీకి కొత్తే..కానీ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు ఇద్దరూ అతి ముఖ్యులే..ఎవరి మాట కాదనలేం. తీసెయ్యలేం..అటు పాదయాత్ర ముగింపు సభ, ఇటు పొంగులేటి చేరిక ఒకే రోజు ఉండటంతో..రాహుల్‌ గాంధీ రెండు వేర్వేరు కార్యక్రమాలకు వెళ్లలేరు. పైగా…ఇలా చేయడం వల్ల అటు కేడర్‌, ఇటు పబ్లిక్‌లోకి రాంగ్‌ మెసేజ్‌ వెళ్తుంది. సో..ఇద్దరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని..రెండు కార్యక్రమాలు ఒకే వేదికపై చేయాలని..కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్‌లో రాహుల్‌ చెప్పారు. ఇందుకు భట్టిని ఒప్పించే బాధ్యతను ఠాక్రే భుజానికెత్తుకున్నారు. మామిళ్లగూడెంలో ఉన్న భట్టి శిబిరానికి వెళ్లారు.. వెంట పొంగులేటినీ తీసుకెళ్లారు. భట్టిని ఒప్పించారు. అంతవరకు తన పాదయాత్ర ముగింపు సభను సొంతంగా ఘనంగా నిర్వహించాలనుకున్న భట్టి..హైకమాండ్‌ఆదేశంతో ఒప్పుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత జులై 2న జరిగే సభ విధివిధానాలపై ఠాక్రే, భట్టి, పొంగులేటి చర్చించారు. ఆ సభలో భట్టిని రాహుల్‌ ఘనంగా సన్మానించనున్నారని..అదే సమయంలో..పొంగులేటి చేరిక ఉంటుందని ఠాక్రే చెబుతున్నారు. జులై 2న ఖమ్మంలో అడుగు పెట్టే భట్టి పాదయాత్రకు పొంగులేటి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే..హై కమాండ్‌ మాట విని..ఒకే వేదికపై ముగింపు సభకు భట్టి ఒప్పుకున్నా..ఆయన అభిమానుల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తూనే ఉన్నట్లు టాక్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..