
సోమవారం హైదరాబాద్: తెలంగాణగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో రికార్డు స్థాయిలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిర అవుతున్నారు. అయితే రాబోయే రోజుల్లోనే ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పస్టం చేసింది. కొన్ని జిల్లాలో ఈ ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరగొచ్చని తెలిపింది. అలాగే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందిని తెలిపింది.
ఇది కూడా చదవండి: మహిళలకు సూపర్ గుడ్న్యూస్.. షూరిటీ లేకుండానే 2 లక్షల లోన్..! 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు
ఇక ఆంధ్రప్రదేశ్లోని 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ,17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
అలాగే పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, పాతపట్నం, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు,సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: మీరు పడుకునే విధానమనే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే?
అలాగే శ్రీకాకుళంలో ఒకటి, విజయనగరంలో 7, మన్యంలో ఒకటి, పోలవరంలో నాలుగు, అనకాపల్లి లో ఒకటి, తూర్పుగోదావరిలో 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందని.. మరోవైపు ద్రోణి ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చూసించింది.
ఇది కూడా చదవండి: హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో రైళ్లు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.