AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జంతు హింస.. పాలమూరు బయోసైన్సెస్‌పై కేసు నమోదు! ఆ ఇన్‌ఫెక్షన్లు మనుషులకు కూడా ప్రమాదమే..?

పాలమూరు బయోసైన్సెస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌పై జంతు హింస ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పెటా ఇండియా ఆరోపణల ప్రకారం, 800 శునకాలను ఉంచేందుకు కేటాయించిన ప్రదేశంలో 1500 శునకాలను ఉంచడం, చికిత్స లేకపోవడం, అశాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. CCSEA కూడా విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది.

జంతు హింస.. పాలమూరు బయోసైన్సెస్‌పై కేసు నమోదు! ఆ ఇన్‌ఫెక్షన్లు మనుషులకు కూడా ప్రమాదమే..?
Palamur Biosciences
SN Pasha
|

Updated on: Jun 19, 2025 | 11:44 AM

Share

పాలమూరు బయోసైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తీవ్రమైన జంతుహింస జరుగుతోందని జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై బూత్‌పూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కర్వెనలోని ల్యాబొరేటరీలో జంతువుల మందులు, పెస్టిసైడ్లు, వైద్య పరికరాల పనితీరును పరీక్షించడానికి అశాస్త్రీయంగా పరిశోధనలు చేస్తున్నారని ‘పెటా ఇండియా’ శాస్త్రవేత్త, రీసెర్చ్‌ పాలసీ అడ్వైజర్‌ డా.అంజనా అగర్వాల్‌ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు బయోసైన్సెస్‌లో 800 శునకాలను ఉంచేందుకు కేటాయించిన స్థలంలో సుమారు 1,500 ఉంచారు. దీనివల్ల అవి తరచూ గాయాలపాలవుతున్నా చికిత్స అందించడం లేదు.

వాటి చర్మం కింద మందులను ఇంజెక్ట్‌ చేయడంతో అక్కడ ఇన్ఫెక్షన్‌ అయి శరీరమంతా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. దీంతో ఈ విషయంపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. IPC 1860 లోని సెక్షన్లు 34, 269, 289, 337, 429 లను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ, BNSS 2023 లోని సెక్షన్ 173(1) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జంతువులపై ప్రయోగాల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ (CCSEA), ప్రాంగణాన్ని తనిఖీ చేయడానికి ఒక అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. కంపెనీ కస్టడీలో జంతువులను చంపడం, వైకల్యం చేయడం, కోలుకోలేని నష్టాన్ని కలిగించడం, నవంబర్ 25, 2013న భారత జంతు సంక్షేమ బోర్డు నోటిఫై చేసిన ప్రోటోకాల్‌లను ఉల్లంఘించడం వంటి అభియోగాలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో నిర్లక్ష్య ప్రవర్తన మానవులకు జూనోటిక్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదానికి దారితీస్తుందని కూడా ప్రస్తావించారు.

2021–22 మధ్యకాలంలో రాజస్థాన్ నుండి రీసస్ మకాక్‌లను పట్టుకున్నారనే ఆరోపణలతో పాలమూర్ బయోసైన్సెస్ వన్యప్రాణుల సంరక్షణ చట్టాల కింద కూడా అభియోగాలు ఎదుర్కొంటోంది. 200కి పైగా జంతు సంక్షేమ సమూహాల సమిష్టి అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ (FIAPO) ఈ సంస్థను శాశ్వతంగా మూసివేయాలని, దాని లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ CCSEAకి ఫిర్యాదును కూడా సమర్పించింది. పెటా ఇండియా CCSEA, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), నేషనల్ GLP కంప్లైయన్స్ మానిటరింగ్ అథారిటీ (NGCMA) లకు కూడా ఫిర్యాదులు చేసింది. ఈ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు, వర్తించే నిబంధనల ప్రకారం ప్రాసిక్యూషన్, జీవించి ఉన్న జంతువుల పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us