AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections: తెలంగాణలో ఎవరి లెక్కలు ఎలా.. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందన్న ప్రచారంతో గులాబీ బాస్‌ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టారు.

Lok Sabha Elections: తెలంగాణలో ఎవరి లెక్కలు ఎలా.. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు..
Telangana
Srikar T
|

Updated on: Jan 27, 2024 | 11:30 AM

Share

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందన్న ప్రచారంతో గులాబీ బాస్‌ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. కారు- సారు-పదహారు నినాదంతో 9 సీట్లు గెలిచింది. అయితే ఈసారి అధికారంలో లేకపోవడంతో మరింత శ్రమించి ఎక్కువ స్థానాలను గెల్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

ఇక బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుంచి మొదలుపెట్టాలని డిసైడ్ అయింది. 2019 ఎన్నికల్లో 4 ఎంపీలు గెలిచిన కమలం పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడంతో డబుల్‌ డిజిట్‌ మార్క్‌కు చేరాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీనిలో భాగంగా రేపు కేంద్రహోంమంత్రి అమిత్ షా కరీంనగర్‌లో బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌ దూసుకెళ్తోంది. 2019 ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ.. ఈసారి అధికారంలో కూడా ఉండడంతో 12 నుంచి 14 సీట్లు గెలవాలని పీసీసీ నేతలు లెక్కలు వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. అయితే ఇప్పటికే టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న మూడు పార్టీలు.. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి