లంచం ఇవ్వడం కోసం భిక్షాటన చేసిన ఓ వ్యక్తి

| Edited By:

Mar 09, 2019 | 8:49 AM

సిద్ధిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చేందుకు ఓ వ్యక్తి భిక్షాటన చేశాడు. తమ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భూ రికార్డులను సరి చేయాలని ఆయాలం అనే రైతు రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగాడు. అయితే.. ఇందుకు గాను రూ.15 వేల లంచం ఇస్తే చేస్తానని గ్రామ రెవిన్యూ అధికారి చెప్పడంతో వేరే దారి లేక బాధితుడు ఆయాలం పట్టణంలోని పలు షాపుల దగ్గరకు వెళ్లి అధికారులకు లంచం ఇవ్వాలని.. […]

లంచం ఇవ్వడం కోసం భిక్షాటన చేసిన ఓ వ్యక్తి
Follow us on

సిద్ధిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చేందుకు ఓ వ్యక్తి భిక్షాటన చేశాడు. తమ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భూ రికార్డులను సరి చేయాలని ఆయాలం అనే రైతు రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగాడు. అయితే.. ఇందుకు గాను రూ.15 వేల లంచం ఇస్తే చేస్తానని గ్రామ రెవిన్యూ అధికారి చెప్పడంతో వేరే దారి లేక బాధితుడు ఆయాలం పట్టణంలోని పలు షాపుల దగ్గరకు వెళ్లి అధికారులకు లంచం ఇవ్వాలని.. దయచేసి దానం చేయమని భిక్షాటన చేశాడు.