AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్లుచెదిరిపోయేలా ఉంది బ్రో.. 48 కేజీల బంగారం, 3.83 లక్షల డైమండ్స్‌తో తయారైన గణపతి!

సాధారణంగా మనం మళ్లీతో తయారు చేసిన గణేస్ విగ్రహాలు లేదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను ఎక్కవగా చూస్తుంటాం.. కానీ ఈ సారి హైదరాబాద్‌లో ఏకంగా 45 కేజీల బంగారంతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించారు భక్తులు.. అది ఎక్కడ , ఆ విగ్రహం తయారీకి అయిన ఖర్చెంత తెలియాంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

కళ్లుచెదిరిపోయేలా ఉంది బ్రో.. 48 కేజీల బంగారం, 3.83 లక్షల డైమండ్స్‌తో తయారైన గణపతి!
48kg Gold Ganesha In Hyderabad
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Sep 15, 2026 | 11:17 AM

Share

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణనాథుడిని వివిధ రూపాలు, ఆకారాలు, అలంకరణలతో ప్రతిష్ఠిస్తూ భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కొలువుదీరిన స్వర్ణ గణపతి, మహారాష్ట్రలో దర్శనమిస్తున్న గోల్డెన్ మోదకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్‌ బేగంబజార్‌ పరిధిలోని ఫీల్‌ఖానాలో ఏర్పాటు చేసిన బంగారు గణేశుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

దాదాపు 48 కిలోల బరువున్న ఈ విగ్రహం తన ప్రత్యేక అలంకరణతో అందరినీ ఆకట్టుకుంటోంది. విగ్రహ రూపకల్పనలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూతతో పాటు సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్‌ను ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. కళాకారులు రాత్రింబవళ్లు శ్రమించి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

స్వర్ణ కాంతులతో మెరిసిపోతున్న గణనాథుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. విగ్రహానికి చేసిన ఆభరణాల అలంకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ప్రత్యేక గణేశుడి రూపకల్పనలో మహారాష్ట్రలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా, తిరుమల శ్రీవారి బాలాజీ రూపాలను స్ఫూర్తిగా తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. బాలాజీ తరహా ఆభరణాల అలంకరణతో పాటు లాల్‌బాగ్చా రాజా శైలిలో గణనాథుడికి రాజసమైన రూపాన్ని ఇచ్చారు. దీంతో ఈ విగ్రహం సాధారణ గణేశ విగ్రహాలకు భిన్నంగా కనిపిస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు దాని వైభవాన్ని చూసి ప్రత్యేక అనుభూతికి లోనవుతున్నారు.

ఇక మహారాష్ట్రలోని నాసిక్‌లో వినాయక చవితి సందర్భంగా తయారు చేసిన గోల్డెన్ మోదకాలు కూడా హాట్‌టాపిక్‌గా మారాయి. విద్యా వికాస్ సర్కిల్‌లోని సాగర్ స్వీట్స్‌లో ఈ ప్రత్యేక మోదకాలను విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల తినదగిన బంగారు పూతతో వీటిని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గోల్డెన్ మోదకాల ధర కిలోకు రూ.27,000గా నిర్ణయించారు. సాధారణ మోదకాలతో పోలిస్తే ధర ఎక్కువగానే ఉన్నప్పటికీ.. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఉండాలని భావించే వారు వీటిపై ఆసక్తి చూపుతున్నారు.

సాగర్ స్వీట్స్‌లో గోల్డెన్ మోదకాలతో పాటు కాజు, డ్రైఫ్రూట్, ఆరెంజ్, మలాయ్ తదితర 25కిపైగా రకాల మోదకాలను అందుబాటులో ఉంచారు. గణపతికి మోదకం అత్యంత ఇష్టమైన నైవేద్యంగా భక్తులు భావిస్తారు. దీంతో వినాయక చవితి సమయంలో ప్రత్యేక రుచులు, అలంకరణలతో తయారు చేసిన మోదకాలకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు గోల్డెన్ మోదకాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీటిపై ఆసక్తి మరింత పెరిగింది.

ఒకవైపు హైదరాబాద్‌లో 48 కిలోల స్వర్ణ గణపతి, మరోవైపు నాసిక్‌లో 24 క్యారెట్ల గోల్డెన్ మోదకాలు.. ఇలా వినాయక చవితి వేడుకల్లో బంగారు మెరుపులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. భక్తి, సంప్రదాయానికి ఆధునిక అలంకరణలు, కొత్త ఆలోచనలు జోడిస్తూ నిర్వహిస్తున్న ఈ వేడుకలు పండుగకు మరింత వైభవాన్ని తీసుకొస్తున్నాయి.

పోస్ట్ చూడండి..

View this post on Instagram

A post shared by TV9 Telugu (@tv9telugu)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us