
ఇటీవల కాలంలో ల్యాప్ టాప్ ల వినియోగం బాగా పెరిగింది. కరోనా అనంతరం అన్ని రంగాలు డిజిటల్ బాట పట్టడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా విద్యారంగంలో ల్యాప్ టాప్ లను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉంటుండంతో విద్యార్థుల తల్లిందండ్రులు సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ ల వైపు మొగ్గచూపుతున్నారు. అవి కూడా దాదాపు రూ. 10వేల నుంచి ప్రారంభమై రూ. 20వేల వరకూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అత్యంత చవకైన ల్యాప్ టాప్ లను తీసుకురావాలని ప్రణాళిక చేసింది. రూ. 15,000 ధరలో ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి తేవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. జియో క్లౌడ్ ల్యాప్ టాప్ పేరిట వీటిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే యాసర్, హెచ్ పీ, లెనోవో వంటి సంస్థలతో చర్చలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ ల్యాప్ ట్యాప్ లో ప్రాసెసర్, స్టోరేజ్ ప్రత్యేకంగా ఉండదు. రెండూ జియో క్లౌడ్ లో ఇమిడి ఉంటాయి. ల్యాప్ టాప్ ఓ డంబ్ టెర్మినల్ ఏర్పడి వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. దీంతో వినియోగదారులు అన్ని సేవలను వేగంతో యాక్సెస్ చేయడానికి ఇది ఉపకరిస్తుంది. అంతేకాక ల్యాప్ టాప్ ధరను అమాంతం పెంచేసే మెమరీ స్టోరేజ్, ప్రాసెసర్ లు రెండూ క్లౌడ్ ద్వారా సమకూర్చుకోవచ్చు కాబట్టి మొత్తం ల్యాప్ టాప్ ధరను ఇది తగ్గిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..