Moto G42: మోటోరోలో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. రూ. 14 వేలకే 50 మెగా పిక్సెల్ కెమెరా..
Moto G42: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది .మోటో జీ42 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేశారు. జూలై 11 నుంచి ఆన్లైన్లో సేల్ ప్రారంభం..
Moto G42: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసింది .మోటో జీ42 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేశారు. జూలై 11 నుంచి ఆన్లైన్లో సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఒకే వేరియంట్లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ రూ. 13,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్లో భాగంగా ఎస్బీ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభించనుంది. మొత్తం రెండు రంగుల్లో ఈ ఫోన్ను తీసుకొచ్చారు.
మోటో జీ42 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమంపై చేస్తుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఈ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్కాం స్నాప్ గ్రాగన్ 680 ప్రాసెసర్ను అందించారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్లో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ను అందించారు. వీటిలో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ కాగా దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
కనెక్టెవిటీ విషయానికొస్తే ఇందులో 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు ఆప్షన్స్ ఇచ్చారు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్లో 20 వాట్స్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..