
దేశంలోని రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. డిజిటల్ ఇండియా పేరుతో రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ఉచిత వై ఫైను అందిస్తున్న భారత ప్రభుత్వం.. ఇకపై దాన్ని మరింత వేగవంతం చేయనుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ఉచిత వైఫై సైకర్యాన్ని కల్పించనుంది. రైల్వే సౌకర్యాలపై రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తే కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రైల్వే మంత్రి ప్రాకరం.. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,115 రైల్వే స్టేషన్లలో అత్యంత వేగవంతమైన హైస్పీడ్ వై-ఫై ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
రైల్వే స్టేషన్లో ఉండే ఉచిత వై-ఫైను కనెక్ట్ చేసుకొని హై స్పీడ్ ఇంటర్నెట్ను ప్రయాణికులు పొందవచ్చు. ఈ వైఫైను వాడుకొని ప్రయాణికులు తమకు అవసరమైన అన్ని సినిమాలు, గేమ్స్, సాంగ్స్ వంటివి డౌన్లోడ్ చేసుకొవచ్చు. ఆన్లైన్లో వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ వైఫై ద్వారా మన ఆఫీస్ పనులు కూడా చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఈ వైఫైను ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు. రైల్వే స్టేషన్లో వైఫైను ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.