AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలులో నిద్రపోయే వారికి గుడ్‌న్యూస్‌.. రైల్వే ప్రత్యేక సర్వీసు.. స్టేషన్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు..

Indian Railways: రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం రైల్వే నిరంతరం తన సేవలను మెరుగుపరుస్తుంది. కొత్త అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోంది. ఇదిలా ఉంటే రైల్వేశాఖ ప్రయాణికులకు..

Indian Railways: రైలులో నిద్రపోయే వారికి గుడ్‌న్యూస్‌.. రైల్వే ప్రత్యేక సర్వీసు.. స్టేషన్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు..
Indian Railways
Subhash Goud
|

Updated on: Aug 12, 2022 | 6:03 PM

Share

Indian Railways: రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం రైల్వే నిరంతరం తన సేవలను మెరుగుపరుస్తుంది. కొత్త అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోంది. ఇదిలా ఉంటే రైల్వేశాఖ ప్రయాణికులకు ఓ శుభవార్త ప్రకటించింది. సాధారణంగా రైళ్లలో నిద్రపోవడం అనేది సహజం. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు త్వరగా నిద్ర వస్తుంది. ఎందుకంటే రైలు పట్టాలపై నడుస్తున్నకొద్ది మనిషి రిలాక్స్‌ అవుతాడు. దీంతో చాలా మంది నిద్రలోకి జారుకుంటారు. ఇంక దూర ప్రయాణం చేసేవారు ఎంచక్క నిద్రపోతారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నిద్రపోయే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ తెలిపింది. రైలులో నిద్రపోతే దిగే స్టేషన్‌ మిస్సవుతుందనే బెంగ ఉండదు. స్టేషన్ మిస్సవుతుందనే చింత లేకుండా హాయిగా నిద్రపోవచ్చు. మీరు స్టేషన్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు రైల్వే మిమ్మల్ని నిద్రలేపుతుంది. దీంతో మీ స్టేషన్ మిస్ కాకుండా మీరు సులభంగా విశ్రాంతి తీసుకోగలుగుతారు.

రైల్వే ఈ ప్రత్యేక సేవ పేరు ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’. చాలా సార్లు ప్రజలు రైలులో నిద్రపోతారు. దీంతో వారు స్టేషణ్‌ను మిస్సయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రైల్వే ఈ సౌకర్యం ప్రారంభించింది. రైల్వే ఈ సదుపాయాన్ని 139 నంబర్ ఎంక్వైరీ సర్వీస్‌లో ప్రారంభించింది. రైలులో ప్రయాణించే ప్రయాణికులు విచారణ వ్యవస్థ నంబర్ 139లో అలర్ట్ సౌకర్యం కోసం అడగవచ్చు.

స్టేషన్ చేరుకోవడానికి 20 నిమిషాల ముందు అలర్ట్ వస్తుంది. మీరు కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఈ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందుకోసం రైల్వేశాఖ కేవలం రూ.3 ఫీజుగా నిర్ణయించింది. మీరు ఈ సేవను పొందాలనుకుంటే మీ స్టేషన్‌కు 20 నిమిషాల ముందు మీ ఫోన్‌కి అలర్ట్ పంపబడుతుంది. తద్వారా మీరు మీ సామాను మొదలైనవాటిని సరిగ్గా ఉంచుకోవచ్చు. మీరు స్టేషన్‌కు రాగానే రైలు దిగండి.

ఇవి కూడా చదవండి

సేవను పొందాలంటే ఏం చేయాలి..?

☛ ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ సేవను ప్రారంభించడానికి, మీరు IRCTC హెల్ప్‌లైన్ 139కి కాల్ చేయాలి.

☛ కాల్ స్వీకరించినప్పుడు మీ భాషను ఎంచుకోండి.

☛ గమ్యస్థానం కోసం, ముందుగా నంబర్ 7ని ఆపై నంబర్ 2ని నొక్కండి.

☛ దీని తర్వాత ప్రయాణికుల నుండి 10 అంకెల PNR నంబర్ అడుగుతుంది.

☛ PNRని నమోదు చేసిన తర్వాత నిర్ధారించడానికి 1కి డయల్ చేయండి.

☛ ఈ ప్రక్రియ తర్వాత, సిస్టమ్ PNR నంబర్‌ను ధృవీకరించండి. అలాగే వేక్అప్ హెచ్చరికను అందించండి.

☛ దీని నిర్ధారణ SMS ప్రయాణికుడి మొబైల్‌కు అందుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో