Google News Showcase: భారత్ వార్త ప్రపంచంపై గూగుల్ న్యూస్ స్పెషల్ ఫోకస్.. ఎందుకో తెలుసా…!

|

May 18, 2021 | 4:47 PM

Google News Showcase: భారత్ వార్త ప్రపంచంపై . టెక్ దిగ్గజం గూగుల్ న్యూస్ ఫోకస్ పెట్టింది.  వార్తా సంస్థల కంటెంట్​ను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన న్యూస్​​ షోకేస్​ను భారత్​లో ప్రారంభించినట్లు గూగుల్ వెల్లడించింది. రానున్న మూడేళ్లలో...

Google News Showcase: భారత్ వార్త ప్రపంచంపై గూగుల్ న్యూస్ స్పెషల్ ఫోకస్.. ఎందుకో తెలుసా...!
Google News Showcase
Follow us on

భారత్ వార్త ప్రపంచంపై . టెక్ దిగ్గజం గూగుల్ న్యూస్ ఫోకస్ పెట్టింది.  వార్తా సంస్థల కంటెంట్​ను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన న్యూస్​​ షోకేస్​ను భారత్​లో ప్రారంభించినట్లు గూగుల్ వెల్లడించింది. రానున్న మూడేళ్లలో దేశంలోని 50 వేల జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యులు పెంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు గూగుల్ తెలిపింది . ఇప్పటికే.. జర్మనీ, కెనాడా, ఫ్రాన్స్, జపాన్​, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, అర్జెంటీనా సహా డజనుకుపైగా దేశాల్లో 700 వార్తా సంస్థలతో గూగుల్​ న్యూస్ షోకేస్​ ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా 30 వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు  తెలిపింది. గూగుల్​ న్యూస్​, డిస్కవర్​ ప్లాట్​ఫామ్​ల ద్వారా దేశంలోని పబ్లిషర్లను ప్రోత్సహించేందుకు, నాణ్యమైన కంటెంట్​ను అందించేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఈ న్యూస్ షోకేస్​. ఇందుకోసం ఆయా సంస్థలకు చెల్లింపులు కూడా జరపనుంది గూగుల్​ సెర్చ్ ఇంజన్.

ఇవి కూడా చదవండి:  హమ్మయ్యా… కోలుకున్నాను! ఇక మళ్లీ వస్తా…! న్యూజిలాండ్​కు పయనమయ్యైన సీఫెర్ట్​..!

కోవిడ్ వ్యాక్సినేషన్ టైంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి.. లేదంటే చాలా డేంజర్..!