Internet Users : ఇంటర్ నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్..! ఇక నుంచి స్పీడ్‌తో పాటు రెండు వందల సబ్సిడీ కూడా..?

Internet Users : ఇంట్లో కూర్చుని ఆఫీసు పని చేస్తున్న వారికి శుభవార్త. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికాం కంపెనీల

Internet Users : ఇంటర్ నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్..! ఇక నుంచి స్పీడ్‌తో పాటు రెండు వందల సబ్సిడీ కూడా..?
Work From Home
Follow us

|

Updated on: May 22, 2021 | 2:35 PM

Internet Users : ఇంట్లో కూర్చుని ఆఫీసు పని చేస్తున్న వారికి శుభవార్త. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికాం కంపెనీల నుంచి పలు సలహాలను కోరింది. దేశంలో ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ను ప్రోత్సహించడానికి ట్రాయ్ వినియోగదారులకు ప్రత్యక్ష రాయితీ నమూనాను పరిశీలిస్తోంది. వినియోగదారులకు నెలకు రూ.200 సబ్సిడీ ఇవ్వాలని ఆలోచిస్తుంది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్‌ను ప్రోత్సహించాలని చూస్తుంది.

దేశంలో 75 కోట్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 73 కోట్ల మంది మొబైల్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగిస్తుండగా, ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ 2.26 కోట్లు మాత్రమే. బ్రాడ్‌బ్యాండ్ వేగం విషయంలో 138 దేశాలలో భారత్ 129 వ స్థానంలో ఉంది. ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌లో 178 దేశాలలో భారత్ 75 వ స్థానంలో ఉంది. ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సంఖ్యను పెంచడానికి భారతదేశం కొత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే వినియోగదారుల సంఖ్య సులభంగా పెరుగుతుంది.

బ్రాడ్‌బ్యాండ్ సంఖ్యను పెంచడానికి, ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కోసం వినియోగదారులకు నెలకు రూ.200 సబ్సిడీ ఇవ్వవచ్చా అని అడిగి కన్సల్టేషన్ పేపర్‌ను ట్రాయ్ విడుదల చేసింది. కంపెనీలు ఇలా చేస్తే వారికి లైసెన్స్ ఫీజుపై తగ్గింపు ఇవ్వవచ్చు. ఇది వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సమయంలో దేశంలో చాలామంది ఇంటి నుంచి పనిచేస్తున్నందున కోట్ల మందికి దీని ప్రయోజనం లభిస్తుంది. అలాగే గ్రామంలో ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను కల్పించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ను ప్రోత్సహించడానికి టెలికం కంపెనీలు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని ట్రాయ్ పేర్కొంది. వీటన్నింటి గురించి కంపెనీలు తమ అభిప్రాయాన్ని జూన్ 10 లోగా తెలపాలి. గ్రామీణ మరియు చిన్న నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సంఖ్యను పెంచడానికి, సబ్సిడీ నమూనాపై అభిప్రాయం కోరినట్లు ట్రాయ్ సంప్రదింపులలో స్పష్టంగా పేర్కొంది. అంటే గ్రామీణ, చిన్న నగరాల్లో దీన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

రాజు తలచుకుంటే ! బెంగాల్ లో బీజేపీ నేత శిశిర్ అధికారికి వై ప్లస్ సెక్యూరిటీ, ఇప్పటికే అధికారి కుటంబంలో ముగ్గురికి…

SHOCKING: సమస్య ఎడమకాలికైతే.. కుడికాలును తీసేసిన డాక్టర్లు!

జపాన్ బుల్లెట్ ట్రెయిన్ డ్రైవర్ ‘కాక్ పిట్’ ను వదిలి, ఎక్కడికి వెళ్లాడంటే ? ప్రయాణికుల్లో క్షణం, క్షణం ..భయం..భయం