గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, ప్రజలు స్మార్ట్ఫోన్ నుండి చాలా సౌకర్యాలను పొందుతున్నారు. చాలా వ్యాపారాలు స్మార్ట్ ఫోన్ మీదనే జరిగిపోతున్నాయి. ప్రజలు తమ దైనందిన జీవితానికి సంబంధించిన సగానికి పైగా పనిని స్మార్ట్ఫోన్ల ద్వారానే నిర్వహిస్తారు. ఆన్లైన్ షాపింగ్ అయినా, పేమెంట్ అయినా లేదా ఏదైనా టికెట్ బుకింగ్ అయినా, ప్రజలు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా ఇంట్లో కూర్చొని ఈ పనులన్నీ చేసేస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ఫోన్ మనుషులకు వరం అని చెప్పడంలో తప్పులేదు. అయితే ఒకవైపు దీని వినియోగం పెరిగిన చోట.. మరోవైపు దీని వల్ల ప్రజల సీక్రెట్ సమాచారం కూడా దుర్వినియోగం కావడం మొదలైంది. సైబర్ మోసగాళ్లు స్మార్ట్ఫోన్ వినియోగదారులను టార్గెట్ చేసి వారి ఫోన్ లోని కీలక సమచారంతో హ్యాకింగ్ చేసి అకౌంటు నుంచి డబ్బులు కొట్టేయడం లాంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. లేదా మరేదైనా పర్సనల్ సమాచారం వారి చేతికి చిక్కినా వారు ప్రజలను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల మీ ఫోన్ దొంగిలించకుండానే హ్యాకింగ్ చేసే వీలుంది. ఈ సమస్యను ఎలా గుర్తించాలి. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..