టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) మొబైల్ వినియోగదారులకు వాట్సాప్లో + 92తో మొదలయ్యే విదేశీ నంబర్ల నుంచి వచ్చే కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సమాచార మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నందున వారి మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేస్తానని బెదిరిస్తూ ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ దుండగులు +92 నెంబర్తో స్టార్ట్ అయ్యే నెంబర్ల నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు గుర్తించింది. ఈ తరహ నెంబర్స్ నుంచి ఫోన్స్ వస్తే ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని వినియోగదారులకు సూచించింది. ఈ నేపథ్యంలో డీఓటీ వినియోగారులకు విదేశీ నెంబర్లపై చేసే హెచ్చరికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సైబర్ నేరగాళ్లు సైబర్-క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు వ్యక్తిగత సమాచారాన్ని బెదిరించేందుకు/దొంగిలించడానికి ఇలాంటి కాల్ల ద్వారా ప్రయత్నిస్తున్నారని డీఓటీ పేర్కొంది. ముఖ్యంగా ఫోన్స్ ద్వారా ఏ చట్టబద్ధ సంస్థ అయినా వ్యక్తిగత వివరాలను అడగదని అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచింది. ఎలాంటి సమాచారాన్నైనా పంచుకోవద్దని పేర్కొంది. డీఓటీ నుంచి ప్రభుత్వ అధికారులను అనుకరిస్తూ మోసపూరిత కాల్లు, మొబైల్ నంబర్ను డిస్కనెక్ట్ చేస్తామని బెదిరించడం లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించడం వంటి నివేదికలు ఇటీవల పెరుగుతున్నాయని హెచ్చరింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వాట్సాప్ కాల్లు విదేశీ నంబర్ల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా +92 (పాకిస్తాన్ కోడ్)తో ప్రారంభమయ్యేవిగా గుర్తించింది. ఈ నెంబర్ల నుంచి స్కామర్లు పౌరులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..