Agriculture: వ్యవసాయం రంగంలో సరికొత్త ప్రయోగం.. డిఎస్ఆర్ టెక్నాలజీతో వరి నాట్లు.. 20% నీరు ఆదా..

| Edited By: Ravi Kiran

Jun 12, 2021 | 8:23 AM

Agriculture: డిఎస్ఆర్ మెషిన్ (డైరెక్ట్ సీడర్ రైస్) ద్వారా వరిని నాటాలని హర్యానా ప్రభుత్వం రైతులకు సూచించింది. దీని వలన నీరు గణనీయంగా..

Agriculture: వ్యవసాయం రంగంలో సరికొత్త ప్రయోగం.. డిఎస్ఆర్ టెక్నాలజీతో వరి నాట్లు.. 20% నీరు ఆదా..
Dsr Mesine
Follow us on

Agriculture: డిఎస్ఆర్ మెషిన్ (డైరెక్ట్ సీడర్ రైస్) ద్వారా వరిని నాటాలని హర్యానా ప్రభుత్వం రైతులకు సూచించింది. దీని వలన నీరు గణనీయంగా ఆదా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు.. పంట కూడా వారం పది రోజుల ముందే చేతికి అందుతుందని తెలిపింది. సాధారణంగా జూన్ 15 నుండి వరి నాట్లు ప్రారంభం అవుతుంటాయి. చాలా మంది రైతులు సాంప్రదాయ పద్ధతిలో వరి మొలకలను తయారు చేసి, ఆయా పొలాలలో నాటుతారు. ఈ పద్ధతిలో, పొలంలో నీటితో నింపడం ద్వారా నాటడం జరుగుతుంది. నాట్లు వేసిన తరువాత కూడా పొలంలో నీటిని కాపాడుకోవాలి. ఈ సమయంలో, అధిక ఉష్ణోగ్రత కారణంగా, నీటి బాష్పీభవనం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.

భూగర్భ జలాలు, శ్రమ, సమయాన్ని ఆదా చేయడానికి, రైతులు నేరుగా డిఎస్ఆర్ యంత్రం ద్వారా వరిని విత్తవచ్చు అని హర్యానా సర్కార్ తాజాగా ప్రకటించింది. ఈ పద్ధతికి ముందు, లేజర్ లెవెలర్ ద్వారా ఫీల్డ్‌ను సమం చేయడం అవసరం. దీని తరువాత, నీటిలో నానబెట్టిన దశలో వరి మొలకలను నేరుగా విత్తడం చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా విత్తడం వలన 15 నుంచి 20 శాతం నీరు ఆదా అవుతుందని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.

పది రోజుల ముందే చేతికి పంట..
ఈ యంత్రంతో రైతులు ఇసుక భూములలో విత్తనాలు వేయవద్దని అధికారులు సూచించారు. రైతులు ఇప్పటికే వరి పంట పండిస్తున్న పొలాల్లో మాత్రమే డీఎస్ఆర్ మెషీన్ ద్వారా విత్తాలని చెబుతున్నారు. ప్రత్యక్ష విత్తనాల పద్ధతిలో వరిని విత్తడం ద్వారా.. దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా.. వారం, పది రోజుల ముందే పంట చేతికి అందుతుందని తెలిపారు. తద్వారా తదుపరి పంట కోసం ఎక్కువ సమయం దొరుకుతుందన్నారు.

Also read:

Murder: భర్తతో విభేదాలు.. పగ పెంచుకున్న భార్య అతన్ని చంపేసింది.. అయినా కసితీరక పురుషాంగం కోసి నూనెలో వేంపి..