AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. తన మీద తానే సెటైర్ వేసుకున్నాడే

సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో విభిన్న శైలిలో ట్వీట్లు చేసే ఈ మాజీ క్రికెటర్.. తాజాగా తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. ఓ మ్యాచ్ గురించి గుర్తుచేసుకున్న ఆయన తాను డకౌట్ అయిన విషయాన్ని సెటైరికల్‌గా పేర్కొన్నాడు. ‘‘సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌ జట్టుపై జరిగిన మూడో టెస్ట్‌లో కింగ్ పెయిర్ స్కోర్ చేశా. ఆ స్కోర్‌తో […]

వార్నీ.. తన మీద తానే సెటైర్ వేసుకున్నాడే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 12, 2019 | 5:13 PM

Share

సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో విభిన్న శైలిలో ట్వీట్లు చేసే ఈ మాజీ క్రికెటర్.. తాజాగా తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. ఓ మ్యాచ్ గురించి గుర్తుచేసుకున్న ఆయన తాను డకౌట్ అయిన విషయాన్ని సెటైరికల్‌గా పేర్కొన్నాడు.

‘‘సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌ జట్టుపై జరిగిన మూడో టెస్ట్‌లో కింగ్ పెయిర్ స్కోర్ చేశా. ఆ స్కోర్‌తో అనుకోకుండా ఆర్యభట్టకు నేను నివాళులు అర్పించా(డకౌట్). మనం పెయిల్ అవ్వడానికి జీరో ఛాన్స్ ఉంటే ఏమీ చేస్తాం. మీరు ఏదైనా కనిపెడితే అది చేయండి’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కాగా ఆ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన సెహ్వాగ్.. మూడో టెస్ట్‌లో సున్నాకే ఔటయ్యాడు. ఇక ఈ సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది ఇంగ్లండ్ టీమ్. కాగా ఈ ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.