AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thailand Open 2022: సెమీఫైనల్‌లోనే ముగిసిన పీవీ సింధు ప్రయాణం.. చైనా ప్లేయర్‌పై ఘోర పరాజయం..

పీవీ సింధు చివరిసారిగా 2019లో జరిగిన BWF వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చెన్ యు ఫీ చేతిలో ఓడిపోయింది. మరలా ఇదే సీన్ నేడు రిపీట్ అయింది.

Thailand Open 2022: సెమీఫైనల్‌లోనే ముగిసిన పీవీ సింధు ప్రయాణం.. చైనా ప్లేయర్‌పై ఘోర పరాజయం..
Thailand Open 2022 Pv Sindhu
Venkata Chari
|

Updated on: May 21, 2022 | 3:54 PM

Share

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu) శనివారం జరిగిన సెమీ-ఫైనల్లో ఘోర పరాజయం చవి చూసింది. ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫీతో వరుస గేమ్‌లలో ఓడి థాయ్‌లాండ్ ఓపెన్(Thailand Open 2022) నుంచి నిష్క్రమించింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు 17-21 16-21 తేడాతో మూడో సీడ్ చెన్ యు ఫీ చేతిలో కేవలం 43 నిమిషాల్లో ఓడి సూపర్ 500 టోర్నీలో తన ప్రయాణాన్ని ముగించింది. ఆరో సీడ్ సింధు ఈ మ్యాచ్‌కు ముందు చెన్‌పై 6-4 తేడాతో విజయం సాధించినా చైనా క్రీడాకారిణిపై అంతగా రాణించలేకపోయింది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో శుక్రవారం జపాన్‌కు చెందిన అకానె యమగుచిపై ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌పై మూడు గేమ్‌ల విజయంతో పీవీ సింధు సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. 51 నిమిషాల్లో 21-15 20-22 21-13తో రెండో సీడ్ జపాన్‌ను ఓడించింది. సింధు ప్రీ-మ్యాచ్ విన్నింగ్ రికార్డ్ 13-9గా ఉంది. ఆమె ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌పై తన 14వ విజయాన్ని సాధించడానికి మరో అద్భుతమైన ప్రదర్శన చేసింది.

Also Read: హక్కుల కోసం దిగ్గజ బాక్సర్‌తో పోరాటం.. ఫెడరేషన్ హ్యాండిచ్చినా తగ్గని నైజం.. కట్‌చేస్తే.. చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దబిడ్డ..

పీవీ సింధు వరుస గేమ్‌లలో ఓడిపోయింది..

హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల సింధు.. చివరిసారిగా 2019 BWF వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చెన్‌తో ఓడిపోయింది. తొలి గేమ్‌ను 3-3తో డ్రా చేసుకున్న సింధు.. విరామం వరకు 7-11తో వెనుకంజలో నిలిచింది. చెన్ ర్యాలీలలో ఆధిపత్యాన్ని కొనసాగించి, ఐదు గేమ్ పాయింట్లను నిలుపుకుంది. సింధు రెండు గేమ్ పాయింట్లను కాపాడుకుంది. అయితే చైనా ప్రత్యర్థి మొదటి గేమ్‌ను సులభంగా గెలుచుకుంది. ప్రపంచ 7వ ర్యాంకర్ సింధు రెండో గేమ్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి 6-3తో ఆధిక్యంలో నిలిచింది. విరామం వరకు రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. కానీ ప్రపంచ నాలుగో ర్యాంకర్ చైనా ప్లేయర్ వెంటనే గేమ్‌ను కైవసం చేసుకోవడం ప్రారంభించింది. 15-12తో ఆధిక్యంలో నిలిచింది. దీని తర్వాత సింధు లయను అందుకోలేకపోయింది. చెన్ నాలుగు మ్యాచ్ పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

ప్రణయ్, సైనా కూడా..

ఈ సీజన్‌లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్‌లో రెండు సూపర్ 300 టైటిళ్లను గెలుచుకున్న సింధు.. ప్రస్తుతం జూన్ 7-12 వరకు జకార్తాలో జరిగే ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో పాల్గొననుంది. థామస్ కప్ క్వార్టర్ ఫైనల్స్, సెమీ-ఫైనల్స్ సమయంలో నిర్ణయాత్మక మూడో సింగిల్స్‌ను గెలుచుకున్న ప్రణయ్, మలేషియాకు చెందిన డారెన్ లియు చేతిలో 17-21 21-15 15-21 తేడాతో ఓడిపోయాడు. లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. 50 నిమిషాల్లో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో కొరియాకు చెందిన కిమ్ గా యున్‌తో 21-11 15-21 17-21 తేడాతో ఓడిపోయింది.

Also Read: Deepak Chahar Wedding: జూన్ 1న పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా పాస్ట్ బౌలర్.. వధువు ఎవరంటే?

Airthings Masters: ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్.. 3 నెలల్లో రెండోసారి..