AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్‌లో జపాన్‌ను చిత్తుచేసి ఒలింపిక్ టిక్కెట్‌ పట్టిన హాకీ టీం..

ఐదేళ్ల క్రితం ఆసియా క్రీడలు 2018లో భారత జట్టు స్వర్ణం గెలవలేకపోయింది. ఆ సమయంలో టీమ్ ఇండియా క్వాలిఫికేషన్ టోర్నీ ద్వారా ఒలింపిక్ టిక్కెట్‌ను పొందింది. ఆ తర్వాత జపాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ద్వారా నేరుగా అర్హత సాధించింది. టీమ్ ఇండియా ఈసారి ఆ పనిని పూర్తి చేసింది.

Asian Games 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్‌లో జపాన్‌ను చిత్తుచేసి ఒలింపిక్ టిక్కెట్‌ పట్టిన హాకీ టీం..
Asian Games 2023
Venkata Chari
|

Updated on: Oct 06, 2023 | 6:05 PM

Share

భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడలు 2022 స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇటీవల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు ఫైనల్లో జపాన్‌ను 5-1తో ఓడించి నాలుగోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ బృందం కూడా 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా క్రీడలు 2022లో భారత్‌కు ఇది 22వ బంగారు పతకం. 2018లో జరిగిన ఈ ఈవెంట్‌లో జపాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. దీంతో భారత జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భారత్ తరపున మన్‌ప్రీత్ సింగ్ 25వ నిమిషంలో, హర్మన్‌ప్రీత్ సింగ్ 32వ, 59వ నిమిషాల్లో, అమిత్ రోహిదాస్ 36వ నిమిషంలో, అభిషేక్ 48వ నిమిషంలో గోల్స్ చేశారు. జపాన్‌కు చెందిన తనకా 51వ నిమిషంలో జట్టుకు ఏకైక గోల్‌ అందించాడు.

ఇవి కూడా చదవండి

దీంతో ఈరోజు భారత్ 1 స్వర్ణం, 2 రజతం, 6 కాంస్య పతకాలతో మొత్తం 8 పతకాలు సాధించింది. మొత్తం పతకాల సంఖ్య 95కి చేరుకుంది.

రెజ్లింగ్‌లో మహిళల 62 కేజీల విభాగం తర్వాత 76 కేజీల ఫ్రీస్టైల్‌లో భారత్‌కు కాంస్యం లభించింది. మంగోలియాకు చెందిన గన్బత్ అరియుంజర్గల్‌ను ఓడించి భారత్‌కు చెందిన కిరణ్ కాంస్యం గెలుచుకున్నాడు. మరోవైపు పురుషుల ఫ్రీస్టైల్ 57కేజీ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన అమన్‌ కాంస్యం సాధించాడు. అదే సమయంలో బ్రిడ్జ్ గేమ్‌లో టీమ్ ఫైనల్‌లో భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది.

ఈరోజు, భారత పురుషుల జట్టు ఆర్చరీ రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో 62 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో 21 ఏళ్ల సోనమ్ మాలిక్ చైనాకు చెందిన జియా లాంగ్‌ను ఓడించింది.

అంతకుముందు సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై ఓడి భారత మహిళల జట్టు కాంస్య పతకాన్ని అందుకుంది. ఆర్చరీ రికర్వ్ మహిళల జట్టు తర్వాత, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ కాంస్య పతకాన్ని అందుకుంది.

భారత్‌కు 100 పతకాలు ఖాయం..

హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాల సంఖ్యను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు 9 పతకాలు సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 95కి చేరుకుంది. దీంతో ఈరోజు భారత్ 4 క్రీడాంశాల్లో 7 పతకాలను ఖాయం చేసుకుంది. దీని ప్రకారం భారత్ 100 పతకాలకు చేరువలో ఉంది.

కాగా, హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 12వ రోజు 5 పతకాలు సాధించింది. 12వ రోజు భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది. ఇందులో 3 స్వర్ణం, 1 రజతం, ఒక కాంస్యం ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..