Cricket: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కెఎల్.రాహుల్.. ఎందుకు ఇచ్చారో చెప్పిన హర్షా భోగ్లే..

భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గువహటి వేదికగా జరిగిన రెండో మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే పరుగుల సునామీ పారించిన ఈ మ్యాచ్ లో గెలుపుపై చివరి వరకు..

Cricket: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కెఎల్.రాహుల్.. ఎందుకు ఇచ్చారో చెప్పిన హర్షా భోగ్లే..
K L Rahul
Follow us

|

Updated on: Oct 03, 2022 | 6:14 PM

భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గువహటి వేదికగా జరిగిన రెండో మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే పరుగుల సునామీ పారించిన ఈ మ్యాచ్ లో గెలుపుపై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగుల భారీ స్కోర్ చేయడంతో గెలుపు సులభమే అనుకున్నారు అంతా. అయితే దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్లు తమ విరోచితమైన బ్యాటింగ్ తో భారీ స్కోర్ ను చేధించేలా కన్పించారు. అయితే దీపక్ చాహర్ వేసిన 17వ ఓవర్ తో పాటు, హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్ లో భారీ పరుగులు ఇవ్వకపోవడంతో దక్షిణాఫ్రికా అపజయాన్ని చూడాల్సి వచ్చింది. ఓడిపోయినప్పటికి డేవిడ్ మిల్లర్ 225.5 స్ట్రెయిక్ రేటుతో 47 బంతుల్లో 106 పరుగులు చేసి ఆకట్టకున్నాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికిస్తారనేది ఆసక్తిగా మారింది. మొదట భారత్ ఆటగాడికి ఇస్తారా, దక్షిణాఫ్రికా ఆటగాడికి ఇస్తారా అనే అనుమానం అందరిలో కలిగింది. దక్షిణాఫ్రికాకు అయితే డేవిడ్ మిల్లర్ కే ఇస్తారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ భారత క్రీడాకారుడుకి ఇస్తే సూర్య కుమార్ యాదవ్ కు ఇస్తారని అనుకున్నారు క్రికెట్ అభిమానులు. కాని మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ కు భారత ఓపెనర్ బ్యాట్స్ మెన్ కెఎల్.రాహుల్ ను ఎంపిక చేశారు.

ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులే కాదు కెఎల్.రాహుల్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా కెఎల్.రాహుల్ బయటపెట్టాడు. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో అక్టోబర్ 2వ తేదీ ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో రెండు జట్లు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్ కెఎల్.రాహుల్ 28 బంతుల్లో 57 పరుగులు చేసి, రోహిత్ శర్మతో కలిసి భారత్‌కు గొప్ప ప్రారంభాన్ని అందించాడు. రోహిత్ శర్మ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 61 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి కారణమయ్యాడు. మరో వైపు విరాట్ కోహ్లీ కూడా 28 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీంతో తన స్టైలిస్ బ్యాటింగ్ తో 277 స్ట్రెయిక్ రేటుతో 61 పరుగులు చేయడంతో అంతా సూర్య కుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారని భావించారు. అయితే ప్యానలిస్టులు మాత్రం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కోసం కెఎల్.రాహుల్ ను ఎంపిక చేసి క్రికెట్ అభిమానులందరినీ ఆశ్చర్యపర్చారు.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా వైస్ కెప్టెన్ కెఎల్.రాహుల్ మాట్లాడుతూ.. భారత జట్టు అత్యధిక స్కోరు చేయడానికి సూర్య కుమార్ యాదవవ్ ఆడిన నాక్ కారణమని, అయితే తనకు అవార్డు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని ప్రజంటర్ హర్షా భోగ్లేతో అన్నారు. అయితే కెఎల్.రాహుల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు వచ్చిందో హర్షా భోగ్లే వివరించాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ఇలా ఆడటం చాలా కష్టమని అన్నాడు. దీంతో కెఎల్.రాహుల్ ఒక్కసారిగా నవ్వేశాడు. అయితే ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ తమ పని తాము చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తామని, వన్డేల్లో మిడిల్ ఆర్డర్ లో కొన్ని ఇన్నింగ్స్ లు ఆడటం వల్ల ఓపెనింగ్ లో ఆడటం కొంచెం కష్టమైనప్పటికి.. సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఈ మ్యాచ్ లో ఎంతో ప్రభావాన్ని చూపించాడని తెలిపాడు కెఎల్.రాహుల్. అలాగే చివరిలో బ్యాటింగ్ కు వచ్చి 7 బంతుల్లో 17 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ తో పాటు, విరాట్ కోహ్లీని కెఎల్.రాహుల్ ఈ సందర్భంగా ప్రశంసించాడు. మొత్తం మీద తనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావడంపై కెఎల్.రాహుల్ స్వయంగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!