వరల్డ్‌కప్‌లో పాక్‌కు సాయం అసహ్యం: సచిన్‌

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:15 PM

దిల్లీ: ప్రపంచకప్‌లో భారత్‌ ఆడకుండానే పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు అప్పగించడాన్ని వ్యక్తిగతంగా అసహ్యించుకుంటానని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెండుల్కర్‌ అన్నారు. అలాంటి చర్య మెగా టోర్నీలో పాక్‌కు సహాయం చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకోవాలని కొందరు మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతోంది. దీంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రికెట్‌ పాలకుల కమిటీ సైతం ప్రభుత్వ […]

వరల్డ్‌కప్‌లో పాక్‌కు సాయం అసహ్యం: సచిన్‌
Follow us on

దిల్లీ: ప్రపంచకప్‌లో భారత్‌ ఆడకుండానే పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు అప్పగించడాన్ని వ్యక్తిగతంగా అసహ్యించుకుంటానని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెండుల్కర్‌ అన్నారు. అలాంటి చర్య మెగా టోర్నీలో పాక్‌కు సహాయం చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు.

పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకోవాలని కొందరు మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతోంది. దీంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రికెట్‌ పాలకుల కమిటీ సైతం ప్రభుత్వ నిర్ణయం మేరకు బీసీసీఐ నడుచుకుంటుందని తెలిపింది.

‘ప్రపంచకప్‌లో పాక్‌పై ప్రతిసారీ భారత్‌దే పైచేయి. ఇది మరోసారి వారిని ఓడించే సమయం. రెండు పాయింట్లు అప్పగించి టోర్నీలో వారికి సాయం చేయడాన్ని నేను అసహ్యించుకుంటా. ఇంతకు ముందే చెప్పినట్టు నా దృష్టిలో భారత్‌కే ప్రథమ ప్రాధాన్యం. అందుకే నా దేశం తీసుకొనే నిర్ణయం ఏదైనా మనసారా ఆహ్వానిస్తా’ అని సచిన్‌ అన్నాడు. పాక్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని అంతకు ముందు సునీల్‌ గావస్కర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. దాయాదిని ఓడించి టోర్నీలో ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని ఆయన అన్నారు.