ఆ ఒక్క ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు

| Edited By: Srinu

Mar 06, 2019 | 7:55 PM

విశాఖ: ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఉంది. రెండు టీ20ల్లో భాగంగా విశాఖలో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో మొదట భారత్ ఓడిపోతుందనే అనుకున్నారు అంతా. కానీ భారత బౌలర్ల సత్తా చూసి టీమిండియాదే మ్యాచ్ అనే భావనకు వచ్చేశారు. ముఖ్యంగా భారత అద్భుతమైన బౌలర్ జాస్ప్రిత్ బూమ్ర వేసిన 19వ ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. విశాఖ తీరాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసిస్ జట్టు […]

ఆ ఒక్క ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు
Follow us on

విశాఖ: ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఉంది. రెండు టీ20ల్లో భాగంగా విశాఖలో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో మొదట భారత్ ఓడిపోతుందనే అనుకున్నారు అంతా. కానీ భారత బౌలర్ల సత్తా చూసి టీమిండియాదే మ్యాచ్ అనే భావనకు వచ్చేశారు. ముఖ్యంగా భారత అద్భుతమైన బౌలర్ జాస్ప్రిత్ బూమ్ర వేసిన 19వ ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

విశాఖ తీరాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసిస్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు దించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు కోహ్లీ సేన 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఆసిస్ స్కోర్ 111/5. మ్యాచ్ గెలిచేందుకు ఇంకా రెండు ఓవర్లలో 16 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో 19వ ఓవర్ వేసిన బూమ్రా రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

అంతే భారత్‌కు ఒక్కసారిగా పూర్తి ఆత్మ విశ్వాసం వచ్చింది. ఇక చివరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సి ఉండగా అది చాలా కష్టమనే అంతా భావించారు. ఉమేశ్ యావ్ వేసిన ఆ ఓవర్‌లో ఆసిస్ బ్యాట్స్‌మెన్ చివరి బంతికి 2 పరుగులు చేసి 14 పరుగులు రాబట్టేశారు. దీంతో భారత్ మ్యాచ్ ఓడిపోయింది. అయితే 19వ ఓవర్ వేసిన బూమ్రా గురించి మాత్రం అంతా మాట్లాడుకుంటున్నారు.

పలువురు క్రికెట్ విశ్లేషకులు బూమ్రాను ఆకాశానికెత్తేస్తున్నారు. బూమ్రా ఎందుకు వరల్డ్ క్లాస్ క్రీడాకరుడనేది మరోసారి నిరూపించాడని అంటున్నారు.