ద్యుతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: సోదరి సరస్వతి

| Edited By:

May 20, 2019 | 3:07 PM

తన సోదరిని ఆమె గర్ల్‌ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ చేస్తోందని భారత అథ్లెట్ ద్యుతి చంద్ సోదరి సరస్వతి మీడియాకు తెలిపింది. ద్యుతి ఆస్తి మీద కన్నేసిన ఆమె గర్ల్‌ఫ్రెండ్.. తన సోదరిపై ఒత్తిడి తెస్తోందని వెల్లడించింది. ‘‘ద్యుతి వెల్లడించిన నిర్ణయం ఆమె సొంతంగా తీసుకున్నది కాదు. పెళ్లి చేసుకోవాలంటూ ద్యుతిపై ఆ కుటుంబం(గర్ల్‌ఫ్రెండ్)ఒత్తిడి చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ద్యుతి ఆస్తిని సొంతం చేసుకోవడానికే వారు ఇదంతా చేస్తున్నారు’’ అంటూ సరస్వతి చెప్పింది. అంతేకాకుండా ద్యుతి జీవితం ప్రమాదంలో […]

ద్యుతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: సోదరి సరస్వతి
Follow us on

తన సోదరిని ఆమె గర్ల్‌ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ చేస్తోందని భారత అథ్లెట్ ద్యుతి చంద్ సోదరి సరస్వతి మీడియాకు తెలిపింది. ద్యుతి ఆస్తి మీద కన్నేసిన ఆమె గర్ల్‌ఫ్రెండ్.. తన సోదరిపై ఒత్తిడి తెస్తోందని వెల్లడించింది. ‘‘ద్యుతి వెల్లడించిన నిర్ణయం ఆమె సొంతంగా తీసుకున్నది కాదు. పెళ్లి చేసుకోవాలంటూ ద్యుతిపై ఆ కుటుంబం(గర్ల్‌ఫ్రెండ్)ఒత్తిడి చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ద్యుతి ఆస్తిని సొంతం చేసుకోవడానికే వారు ఇదంతా చేస్తున్నారు’’ అంటూ సరస్వతి చెప్పింది. అంతేకాకుండా ద్యుతి జీవితం ప్రమాదంలో ఉందని.. ప్రభుత్వం ఆమెకు సెక్యురిటీని కల్పించాలంటూ సరస్వతి అభ్యర్థించింది.

‘‘ద్యుతి మేజర్. అబ్బాయిని వివాహం చేసుకోవాలా..? లేక అమ్మాయిని పెళ్లాడాలా..? అన్నది పూర్తిగా ఆమె ఇష్టం. కానీ ఈ విషయంలో ఆమెను బలవంతం చేస్తున్నారు. ద్యుతి విజయంలో కీలక పాత్ర పోషించిన చాలా మంది ఆట నుంచి ఆమెను దూరం చేయాలనుకున్నారు. అందుకే అనవసరంగా ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి, ఇలాంటి విషయాల్లోకి లాగుతున్నారు. 2020లో జరగనున్న ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఆమెను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ద్యుతి విజయం సాధించాలని ప్రతి ప్రభుత్వ శాఖ కూడా ఆమెను ప్రోత్సహిస్తూనే ఉంది’’ అని సరస్వతి తెలిపింది.

కాగా తాను స్వలింగ సహజీవనం చేస్తున్నానంటూ ద్యుతి చంద్ బహిరంగంగా ప్రకటించి సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.