AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ‘మొదట బ్యాటింగ్.. ఆ తర్వాత ఇలా చేస్తే సెమీస్’.. పాక్ జట్టుకు అక్రమ్ ఫన్నీ సూచన..

ICC World Cup 2023: పాకిస్తాన్ టాక్ షో ది పెవిలియన్‌కు అతిథిగా వచ్చిన అక్రమ్, మిస్బాలు సెమీ-ఫైనల్‌కు ఎలా చేరుకోవాలో పాకిస్తాన్ జట్టుకు సూచించారు. వీరి ప్రకారం పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలో సూచించారు. వీరు సరదాగా చెప్పిన ఈ ఐడియాలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. అవేంలో ఇప్పుడు చూద్దాం..

Pakistan: 'మొదట బ్యాటింగ్.. ఆ తర్వాత ఇలా చేస్తే సెమీస్'.. పాక్ జట్టుకు అక్రమ్ ఫన్నీ సూచన..
Pakistan Cwc 2023
Venkata Chari
|

Updated on: Nov 10, 2023 | 3:38 PM

Share

2023 ప్రపంచ కప్ (ICC World Cup 2023)లో, న్యూజిలాండ్ శ్రీలంక జట్టును ఓడించిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు దాదాపు సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్ జట్టు సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాలి. దీని ప్రకారం, తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనున్న పాకిస్థాన్ కనీసం 287 పరుగుల తేడాతో ఇంగ్లిష్‌ను ఓడించాల్సి ఉంటుంది. లేదా ఇంగ్లండ్ ఇచ్చే ఏ లక్ష్యమైనా కేవలం 3.4 ఓవర్లలోనే సాధించాల్సి ఉంటుంది. అప్పుడే పాకిస్థాన్ జట్టు టాప్ 4లో నిలుస్తుంది. అయితే పైన పేర్కొన్న విధంగా పాకిస్థాన్ జట్టుకు గెలవడం అసాధ్యం. కాబట్టి బాబర్ సైన్యం ఈసారి ప్రపంచకప్‌నకు దూరమైందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ (Wasim Akram) పాక్ జట్టు సెమీఫైనల్‌కు సులువుగా చేరేందుకు మార్గం ప్రకటించాడు.

డ్రెస్సింగ్ రూమ్‌కు తాళం వేయండి..

పాకిస్థాన్ టాక్ షో ది పెవిలియన్‌కు అతిథిగా హాజరైన అక్రమ్.. సెమీఫైనల్‌కు ఎలా చేరుకోవాలో పాక్ జట్టుకు చెప్పుకొచ్చాడు. అక్రమ్ ప్రకారం, పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్‌లో బంధించాలి. కనీసం 20 నిమిషాల పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరూ గది నుంచి బయటకు రాకుండా చూసుకోండి. అప్పుడు ఐసీసీ టైమ్ అవుట్ రూల్ ప్రకారం ఇంగ్లండ్ ఆటగాళ్లందరూ ఔట్ అవుతారు. దీని ద్వారా పాకిస్థాన్ జట్టు సులభంగా సెమీఫైనల్‌లోకి ప్రవేశించగలదని వసీం అక్రమ్ సరదాగా అన్నాడు.

మిస్బా మరో ఆలోచన ప్రకారం..

అక్రమ్ తర్వాత మిస్బా ఉల్ హక్ కూడా మరో ఐడియా ఇచ్చాడు. మిస్బా ప్రకారం, ‘పాక్ మొదట బ్యాటింగ్ చేయాలి. ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి మైదానంలోకి ప్రవేశించే ముందు, వారిని డ్రెస్సింగ్ రూమ్‌లో కట్టేయాలి. అప్పుడు కూడా టైమ్ అవుట్ రూల్ ప్రకారం పాక్ జట్టు ఈజీగా గెలుస్తుందని సరదాగా బదులిచ్చాడు.

పాకిస్థాన్‌కి సెమీస్‌ అవకాశాలేంటి?

ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే.. ఇంగ్లండ్‌ను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఈ స్థితిలో పాకిస్థాన్ 300 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ జట్టు కేవలం 13 పరుగులకే పరిమితం చేయాల్సి ఉంటుంది. లేదా పాకిస్తాన్ 300 కంటే ఎక్కువ పరుగులు చేస్తే, ఇంగ్లండ్ 287 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించాలి. అప్పుడే పాకిస్థాన్ జట్టుకు అవకాశం దక్కుతుంది. కానీ అది అసాధ్యమని చెప్పవచ్చు.

దీంతో పాయింట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఇక మరో సెమీస్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీంలు తలపడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..