
Vaibhav Sooryavanshi, Abhishek Sharma: ప్రస్తుత సీజన్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేసిన రికార్డు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరి పేరిట ఉంది. వీరు కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. అయితే వైభవ్ సూర్యవంశీ ఈ ఘనతను ఈ ఒక్క సీజన్లోనే రెండుసార్లు సాధించడం విశేషం. గణంకాలను పరిశీలిస్తే వైభవ్ సూర్యవంశీ 5 మ్యాచ్లలో 200 పరుగులు సాధించారు. ఆయన స్ట్రైక్ రేట్ 263.15గా ఉండటం విశేషం, ఇది ఈ సీజన్లో ఏ బ్యాటర్కైనా అత్యుత్తమం. మరోవైపు అభిషేక్ శర్మ 6 ఇన్నింగ్స్ల్లో 188 పరుగులు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ కోచ్ మనీష్ ఓజా ప్రకారం, అభిషేక్ శర్మతో పోలిస్తే వైభవ్ ఐదు కారణాల వల్ల బౌలర్లకు ఎక్కువ ప్రమాదకరంగా కనిపిస్తుంటాడని తెలిపాడు.
అత్యంత దూకుడు: అభిషేక్ కంటే వైభవ్ సహజంగానే ఎక్కువ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. మొదటి బంతి నుంచే బౌలర్పై ఒత్తిడి పెంచడం ఆయన శైలి.
షాట్ల వైవిధ్యం: వైభవ్ వద్ద అభిషేక్ కంటే ఎక్కువ రకాల షాట్లు అందుబాటులో ఉన్నాయి. మైదానం నలుమూలలా బంతిని పంపగల సామర్థ్యం ఆయనకు ఉంది.
వేగవంతమైన పరుగులు: స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే వైభవ్ పరుగులు తీసే వేగం బౌలర్ల లయను దెబ్బతీస్తుంది.
మానసిక ఆధిపత్యం: బౌలర్ ఎవరు అన్నది పట్టించుకోకుండా వారిపై మానసిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో వైభవ్ ముందుంటాడు.
పరిమితులు లేని బ్యాటింగ్: అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలి ఒక పరిధికి లోబడి ఉంటుందని, కానీ వైభవ్ విషయంలో బౌలర్లు ఎక్కడ బంతి వేయాలో అర్థం కాక ఇబ్బంది పడతారని కోచ్ అభిప్రాయపడ్డారు.
ఈ సీజన్లో సిక్సర్ల పరంగా కూడా వైభవ్ దూసుకుపోతున్నారు. కేవలం 5 మ్యాచ్లలోనే ఆయన 18 భారీ సిక్సర్లు బాదారు. సిక్సర్ల జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. అభిషేక్ శర్మ 17 సిక్సర్లతో ఆయన వెంటే ఉన్నారు. మొత్తానికి ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..