టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. కట్‌చేస్తే.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో లక్ష్య విధ్వంసం..!

Dehradun T20 League 2026: భారత అండర్-19 జట్టు పగ్గాలు అందుకున్న 17 ఏళ్ల లక్ష్య రాయ్‌చందానీ ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందే తన సత్తా చూపించాడు. డెహ్రాడూన్ టీ20 లీగ్‌లో 53 బంతుల్లో 76 పరుగులతో మెరిశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. లక్ష్య దూకుడుతో మసూరీ థండర్ 187 పరుగులు చేసింది. మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్‌లో మసూరీ విజయం సాధించింది.

టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. కట్‌చేస్తే.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో లక్ష్య విధ్వంసం..!
Lakshya Raichandani Match Winning Knock

Updated on: Sep 06, 2026 | 6:44 PM

Lakshya Raichandani In Dehradun T20 League 2026: భారత అండర్-19 జట్టు కొత్త కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ (Lakshya Raichandani) ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు బ్యాట్‌తో గర్జించాడు. డెహ్రాడూన్ టీ20 లీగ్‌లో మసూరీ థండర్ తరపున ఆడిన ఈ 17 ఏళ్ల యువ బ్యాటర్.. హర్బర్ట్‌పూర్ నైట్‌రైడర్స్‌పై తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 53 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

6 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు..

అభిమన్యు క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మసూరీ థండర్ ముందుగా బ్యాటింగ్ చేసింది. లక్ష్య క్రీజులో ఉన్నంతసేపు బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆడాడు. అతడి స్కోరులో మూడు ఫోర్లతో పాటు ఆరు సిక్సర్లు ఉన్నాయి. యువ కెప్టెన్ దూకుడైన బ్యాటింగ్‌తో మసూరీ ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చింది.

ఎక్కువమంది చదివినది: Video: ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇవి కూడా చదవండి

187 పరుగుల భారీ స్కోరు..

లక్ష్య తుఫాన్ ఇన్నింగ్స్‌ ఆధారంగా మసూరీ థండర్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 187 పరుగులు చేసింది. అయితే లక్ష్య జట్టు విజయాన్ని నిర్ణీత ఓవర్లలోనే అందుకోలేకపోయింది. హర్బర్ట్‌పూర్ నైట్‌రైడర్స్ కూడా లక్ష్యాన్ని సమర్థంగా ఎదుర్కొని 20 ఓవర్లకు మ్యాచ్‌ను సమం చేసింది.

సూపర్ ఓవర్‌లో మసూరీదే పైచేయి..

స్కోర్లు సమం కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ మసూరీ థండర్ పైచేయి సాధించి విజయం అందుకుంది. ప్రధాన మ్యాచ్‌లో లక్ష్య చేసిన 76 పరుగుల ఇన్నింగ్స్ మసూరీకి పోరాడే స్కోరు అందించడంలో కీలకంగా నిలిచింది.

ఎక్కువమంది చదివినది: Video: సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్.. రీఎంట్రీని ఇక అడ్డుకునేదెవరు?

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్..

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు భారత అండర్-19 జట్టు సన్నద్ధమవుతోంది. సెప్టెంబరు 18 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 17 ఏళ్ల లక్ష్య రాయ్‌చందానీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అంతర్జాతీయ స్థాయిలో దక్కిన ఈ కీలక బాధ్యతకు ముందు వచ్చిన 76 పరుగుల ఇన్నింగ్స్ అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేలా ఉంది.

ఆస్ట్రేలియా సిరీస్ కోసం తన సాధారణ ప్రాక్టీస్‌పైనే దృష్టి పెడుతున్నట్లు లక్ష్య తెలిపాడు. బ్యాటింగ్‌తో పాటు ఆటలోని ఇతర అంశాలపై కూడా పనిచేస్తున్నానని, ఫిట్‌నెస్, సాధన, ప్రతిరోజూ చిన్న చిన్న మెరుగుదలలపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us