Team India Players Playing Beach Volleyball: టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఆడిన తర్వాత, టీమిండియా తదుపరి దశ అంటే సూపర్-8 మ్యాచ్ల కోసం బార్బడోస్ చేరుకుంది. అక్కడ ఆఫ్ఘనిస్థాన్తో సూపర్-8లో తన మొదటి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు కూడా బిజీబిజీగా సిద్ధమవుతున్నారు. కానీ, అంతకు ముందు కనిపించిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలిగించింది. చాలా మంది ఆటగాళ్లు బార్బడోస్ చేరుకున్న తర్వాత షర్టు లేకుండా అర్థనగ్నంగా కనిపించారు.
బార్బడోస్లోని బీచ్లో షర్టులు లేకుండా భారత ఆటగాళ్లందరూ రెండు శిబిరాలుగా విడిపోయారు. ఆపై వారి మధ్య క్రికెట్తో సంబంధం లేని ఆటలో పోటీపడడం కనిపించింది. అంటే, భారత ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ ఆడారన్నమాట. టీ20 ప్రపంచకప్నకు భారత ఆటగాళ్ల సన్నాహాలకు ఈ ఆటకు ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. కానీ, వారికి క్రికెట్ నుంచి కొంత విరామం ఇవ్వాలనే కోణంలో ఇలా చేశారంట.
భారత ఆటగాళ్ళు నిరంతరం క్రికెట్ ఆడటంతో అప్పుడప్పుడు ఇలా ఇతర ఆటలతో సరదాగా మారిపోతుంటారు. వెస్టిండీస్లో క్రికెట్ నిర్వహించే సమయంలో, ఆటగాళ్ళు బీచ్ వాలీబాల్ను ఆస్వాదించడం సర్వసాధారణం. ప్రస్తుతం టీమ్ ఇండియా BCCI షేర్ చేసిన ఈ వీడియోలో టీమిండియా ఆటగాళ్లంతా అర్థనగ్నంగా సరదాగా ఈ గేమ్ ఆడుతూ కనిపించారు.
బార్బడోస్లో, టీం ఇండియా ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ను రెండు క్యాంపులుగా విభజించి ఆడుతూ కనిపించారు. అయితే, విజేతగా నిలిచిన జట్టు ఏది అనేది స్పష్టంగా తెలియలేదు.
బార్బడోస్ బీచ్లో ఇంత సరదాగా గడిపిన టీమిండియా ఆటగాళ్లు మరోసారి క్రికెట్ మైదానంలోకి వచ్చారు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సూపర్-8 మ్యాచ్ల కోసం సన్నాహాలు ప్రారంభించింది. జూన్ 20న ఆఫ్ఘనిస్థాన్తో భారత్ తన తొలి సూపర్-8 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత జూన్ 22న సూపర్-8లో బంగ్లాదేశ్తో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాగా, జూన్ 24న ఆస్ట్రేలియాతో మూడో, చివరి సూపర్-8 మ్యాచ్ ఆడాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..