AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World cup 2024: టీ20 ప్రపంచకప్‌నకు ముందే టీమిండియాలో టెన్షన్.. ట్రోఫీకి అడ్డుగా 10మంది ప్లేయర్లు..

T20 World cup 2024: టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ రాబోతోంది. ప్రపంచకప్ గెలుపు కరువును అంతం చేసే బాధ్యతను సెలక్టర్లు అప్పగించిన 15 మంది ఆటగాళ్లలో చాలా మంది ఇప్పుడు ఐపీఎల్‌లో పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ 30న జట్టు ఎంపిక జరిగిన రెండు వారాల్లోనే చాలా మంది ఆటగాళ్ల పేలవ ఫామ్ తలనొప్పిగా మారింది.

T20 World cup 2024: టీ20 ప్రపంచకప్‌నకు ముందే టీమిండియాలో టెన్షన్.. ట్రోఫీకి అడ్డుగా 10మంది ప్లేయర్లు..
Team India
Venkata Chari
|

Updated on: May 14, 2024 | 1:06 PM

Share

T20 World cup 2024: టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ రాబోతోంది. ప్రపంచకప్ గెలుపు కరువును అంతం చేసే బాధ్యతను సెలక్టర్లు అప్పగించిన 15 మంది ఆటగాళ్లలో చాలా మంది ఇప్పుడు ఐపీఎల్‌లో పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ 30న జట్టు ఎంపిక జరిగిన రెండు వారాల్లోనే చాలా మంది ఆటగాళ్ల పేలవ ఫామ్ తలనొప్పిగా మారింది. ఇందులో స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కూడా ఉండడంతో ఫ్యాన్స్‌లోనూ ఆందోళన మొదలైంది.

కెప్టెన్ రోహిత్ ఫాంపై ఆందోళన..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్‌తో పరుగుల కరవు నెలకొంది. జట్టు ప్రకటించినప్పటి నుంచి శర్మ 4 మ్యాచ్‌లు ఆడి మొత్తం 38 పరుగులు చేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లో 19 పరుగులు చేయడంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ స్పిన్ బౌలింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతని ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్ బ్యాట్ కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ఎంపిక తర్వాత యశస్వి 3 మ్యాచ్‌ల్లో 95 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలర్ల వల్ల జైస్వాల్ చాలా ఇబ్బంది పడ్డాడు.

ఆల్ రౌండర్ల ఫామ్ కూడా..

వరల్డ్ కప్ జట్టులో నలుగురు ఆల్ రౌండర్లను ఎంపిక చేయడం ద్వారా టీమ్ ఇండియా వార్తల్లో నిలిచింది. కానీ, ఇప్పుడు వారి నిరాశాజనక ప్రదర్శన కారణంగా జట్టు ఆందోళన చెందుతోంది. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏప్రిల్ 30 నుంచి 4 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాట్‌తో 3 పరుగులు మాత్రమే జోడించాడు. బౌలింగ్‌లో ఓకే అనిపిస్తున్నాడు. ఎంపికకు ముందు శివమ్ దూబే చూపిన రిథమ్.. ఒక్కసారిగా పడిపోయింది. ఈ వ్యవధిలో దూబే 4 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను రెండుసార్లు ఖాతా తెరవలేకపోయాడు. ‘సర్’ జడేజా ఆల్ రౌండ్ పేలవ ప్రదర్శన ‘తలనొప్పి’గా మారింది. జడేజా 4 మ్యాచ్‌ల్లో 67 పరుగులు చేసి 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆందోళన పెంచుతోన్న వికెట్ కీపర్లు..

ఐపీఎల్ 2024ను అద్భుతంగా ప్రారంభించిన సంజూ శాంసన్.. టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న తర్వాత ఫామ్‌ను కోల్పోయాడు. అతను 3 మ్యాచ్‌ల్లో 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని సహచర వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా రాణించలేకపోయాడు. పంత్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడి 15 పరుగులు చేశాడు.

స్పెషలిస్ట్ బౌలర్లపై ఒత్తిడి..

స్పిన్‌ జోడీ కుల్‌దీప్‌, చాహల్‌ల ఫాం కూడా అంతంతమాత్రంగానే ఉంది. కుల్దీప్ 2 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీయగా, చాహల్ 3 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ కూడా చాలా సాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. మూడు మ్యాచ్‌లలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.

సత్తా చాటిన ఐదుగురు ఆటగాళ్లు..

పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియాకు ఐదుగురు ఆటగాళ్లు మాత్రం కొంత ఊరటనిచ్చారు. ఏప్రిల్ 30 నుంచి ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 161 పరుగులు చేసి అభిమానులకు భరోసా ఇచ్చాడు. టీ-20 ఇంటర్నేషనల్‌లో, నంబర్ 1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 4 మ్యాచ్‌లలో 169 పరుగులు చేయడం ద్వారా తన అద్భుతమైన లయతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో బుమ్రాకు సాటి ఎవరూ లేరని నిరూపించుకున్నాడు. బుమ్రా 4 ఇన్నింగ్స్‌లలో 5 వికెట్లు తీసి బ్యాట్స్‌మెన్‌పై ఉచ్చు బిగించగా, అక్షర్ పటేల్ కూడా పోరాట ఇన్నింగ్స్‌లు ఆడి వికెట్లు తీసి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ కూడా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. సిరాజ్ 4 మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్లలో కూడా బాగా బౌలింగ్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..