AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 3 వన్డేలతో ఏం చేద్దామని.. ఇట్టాగైతే, పాకిస్తాన్‌లో పరువు పోవాల్సిందే.. బీసీసీఐని ఏకిపారేస్తోన్న మాజీలు

Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బీసీసీఐ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం, ఈ టోర్నమెంట్, తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే.. ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్‌లో ఆడుతున్నారు.

Team India: 3 వన్డేలతో ఏం చేద్దామని.. ఇట్టాగైతే, పాకిస్తాన్‌లో పరువు పోవాల్సిందే.. బీసీసీఐని ఏకిపారేస్తోన్న మాజీలు
Team India
Venkata Chari
|

Updated on: Aug 11, 2024 | 6:37 PM

Share

Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బీసీసీఐ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం, ఈ టోర్నమెంట్, తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే.. ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్‌లో ఆడుతున్నారు. అయితే బీసీసీఐ తన షెడ్యూల్‌లో టీ20, టెస్టు మ్యాచ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఎందుకంటే, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు పటిష్ట దళాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో టీమిండియా కోచ్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. కానీ, ఈ ప్రయోగాలు దారుణంగా విఫలమయ్యాయి.

దీని తర్వాత, ఛాంపియన్స్ ట్రోఫీకి బలమైన భారత జట్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా వెల్లడైంది. అయితే, దీనికి టీమిండియాకు కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. అది కూడా వచ్చే ఏడాది కావడం గమనార్హం.

అంటే 2025 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల ద్వారా భారత్ పటిష్టమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి ముందస్తు సన్నద్ధతపై బీసీసీఐ ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న మూడు మ్యాచ్‌ల ద్వారా భారత జట్టును ఎలా ఎంపిక చేస్తారన్న ప్రశ్న తలెత్తింది.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

2025లో టీమిండియా తన తొలి సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. భారత్‌లో జరగనున్న ఈ సిరీస్‌లో టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.

జట్లు తేదీ ఎప్పుడు ఎక్కడ
1వ టీ20, భారత్ vs ఇంగ్లండ్ బుధవారం, 22 జనవరి 2025 7 PM చెన్నై
2వ టీ20, భారత్ vs ఇంగ్లండ్ శనివారం, 25 జనవరి 2025 7 PM కోల్‌కతా
3వ టీ20, భారత్ vs ఇంగ్లండ్ మంగళవారం, 28 జనవరి 2025 7 PM రాజ్‌కోట్
4వ టీ20, భారత్ vs ఇంగ్లండ్ శుక్రవారం, 31 జనవరి 2025 7 PM పూణే
5వ టీ20, భారత్ vs ఇంగ్లండ్ ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 7 PM ముంబై
1వ వన్డే, ఇండియా vs ఇంగ్లండ్ గురువారం, 6 ఫిబ్రవరి 2025 మధ్యాహ్నం 1:30 నాగపూర్
2వ వన్డే, భారత్ vs ఇంగ్లండ్ ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 మధ్యాహ్నం 1:30 కటక్
3వ వన్డే, భారత్ vs ఇంగ్లండ్ బుధవారం, 12 ఫిబ్రవరి 2025 మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్

ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు?

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి తాత్కాలిక తేదీని నిర్ణయించారు. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే, ఈ టోర్నమెంట్ పాకిస్తాన్‌లో జరుగుతుంది. టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లో నిర్వహిస్తే, భారత జట్టు టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించమని అభ్యర్థించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..