India vs Sri Lanka: శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించనున్నాడని సమాచారం. ఈ సిరీస్ నుంచి హిట్మ్యాన్ విరామం తీసుకుంటాడని గతంలో వార్తలు వెలువడ్డాయి. లంకతో వన్డే సిరీస్లో ఆడాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మతో పాటు, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఈ సిరీస్ ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నారు. ఈ టీ20 ప్రపంచకప్నకు ఈ ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు.
ఇప్పుడు, శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మళ్లీ భారత జట్టులో కనిపించనున్నారు. అయితే ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ కనిపించడం అనుమానమే.
శ్రీలంకతో జరిగే సిరీస్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ సిరీస్లో కనిపించరు.
వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ దూరం కాగా, జస్ప్రీత్ బుమ్రా వన్డే, టీ20 సిరీస్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ లేదా ఖలీల్ అహ్మద్కు అవకాశం దక్కే అవకాశం ఉంది.
జులై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొత్తం 6 మ్యాచ్లు జరగనున్నాయి. ముందుగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్, తర్వాత వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..
మొదటి T20: జులై 27 (పల్లెకెలె) – 7 PM IST
రెండవ T20: జులై 28 (పల్లెకెలె) – 7 PM IST
మూడవ T20: జులై 30 (పల్లెకెలె) – 7 PM IST
మొదటి ODI: ఆగస్టు 2 (కొలంబో) – 2.30 PM IST
రెండవ ODI: ఆగస్టు 4 (కొలంబో) – 2.30 PM IST
మూడవ ODI: ఆగస్టు 7 (కొలంబో) – 2.30 PM IST
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..