AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: టీమిండియా ఓటమితో విలన్లుగా మారిన ఆ ఇద్దరు.. కట్‌చేస్తే.. వాళ్లు ఎప్పటికీ హీరోలేనన్న రోహిత్

Team India: పుణె టెస్టులో న్యూజిలాండ్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ని కివీస్ కైవసం చేసుకుని 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.

IND vs NZ: టీమిండియా ఓటమితో విలన్లుగా మారిన ఆ ఇద్దరు.. కట్‌చేస్తే.. వాళ్లు ఎప్పటికీ హీరోలేనన్న రోహిత్
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Oct 27, 2024 | 11:53 AM

Share

IND vs NZ: స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై పేలవమైన ప్రదర్శన కారణంగా జట్టు 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల స్పిన్ ద్వయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం సమర్థించాడు. పూణెలోని MCA స్టేడియంలోని స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లో భారత్ పూర్తిగా విఫలమైంది. టీమిండియా టాప్ స్పిన్నర్ల వైఫల్యం కారణంగా న్యూజిలాండ్ విజయం సాధించింది.

రోహిత్ శర్మ కీలక ప్రకటన..

రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత, విలేకరుల సమావేశంలో భారత స్పిన్నర్ల ప్రదర్శన గురించి కెప్టెన్ రోహిత్ శర్మను విలేకర్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వారి గురించి అందరికి తెలుసు. ఈ ఇద్దరు ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏ మ్యాచ్ ఆడినా వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలని భావిస్తున్నారు. అది సరైంది కాదని నా అభిప్రాయం’ అంటూ సమర్ధించాడు.

ఒక్కసారిగా విలన్‌లుగా మారిన ఇద్దరు..

2012-13లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత స్వదేశంలో భారత్ వరుసగా 18 సిరీస్ విజయాలు శనివారంతో ముగిశాయి. 2011 నవంబర్‌లో అరంగేట్రం చేసిన అశ్విన్, డిసెంబర్ 2012లో తన తొలి టెస్టు ఆడిన జడేజా ప్రమాదకరమైన స్పిన్ జోడీగా ఈ కలల ప్రయాణాన్ని ప్రారంభించారు. సొంతగడ్డపై కలిసి ఆడుతున్న అశ్విన్ 55 టెస్టుల్లో 326 వికెట్లు తీయగా, జడేజా 47 మ్యాచ్‌ల్లో 225 వికెట్లు తీశాడు.

కెప్టెన్ రోహిత్ సపోర్ట్..

టెస్టు గెలవడం సమిష్టి బాధ్యత అంటూ రోహిత్ సమర్దించాడు. ‘ఇద్దరు ఆటగాళ్లే కాకుండా టెస్టు గెలవాల్సిన బాధ్యత మాఅందరిపైనా ఉంది. ఇద్దరూ ఇక్కడ చాలా క్రికెట్ ఆడారు. మా విజయానికి చాలా దోహదపడ్డారు. సొంతగడ్డపై 18 సిరీస్‌లు గెలవడంలో వీరిద్దరూ ప్రధాన పాత్ర పోషించారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘కొన్ని మ్యాచ్‌ల్లో ఫలితాలు వేరేలా ఉంటాయ్’

ముఖ్యంగా ఈ ఇద్దరు ఆటగాళ్ల విషయంలో నేను పెద్దగా పట్టించుకోను. ఏమి జరిగిందో వారికి బాగా తెలుసు. కొన్నిసార్లు కొన్ని మ్యాచ్‌లు వారికి కూడా చెడుగా మారవచ్చు. 500, 300 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఎలా వికెట్లు తీయాలో, ప్రతిసారీ టెస్ట్ మ్యాచ్‌లను ఎలా గెలిపించాలో వాళ్లకు బాగా తెలుసు. కానీ, కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో ఏం ఉండదు’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

‘వాళ్ల బౌలింగ్ పట్ల గర్వంగా ఉంది’

వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌ పట్ల గర్వంగా ఉందని రోహిత్‌ అన్నాడు. మూడేళ్లలో సుందర్ తొలి టెస్టులోనే 11 వికెట్లు పడగొట్టాడు. భారత్ తమ బౌలింగ్‌ను కచ్చితంగా విశ్లేషిస్తుంది. రోహిత్ మాట్లాడుతూ, ‘వాషి అద్భుతంగా ఆడాడు. నేను అతని ఆటను చూసి గర్వపడుతున్నాను. అతను కూడా గర్వపడుతున్నాడు. అతని పనితీరుతో మేం సంతోషిస్తున్నాం. అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు’ అంటూ రోహిత్ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. అసలు విషయం తెలిస్తే..
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. అసలు విషయం తెలిస్తే..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..